హీరోలతో సమానంగా హీరోయిన్లకు ఎందుకు రెమ్యునరేషన్ ఇవ్వరు.. ఎందుకు పారితోషికం విషయంలో హీరో హీరోయిన్లను వేరుగా చూస్తున్నారనే విషయంపై కొన్ని రోజులుగా బాలీవుడ్లో చర్చ జరుగుతూనే ఉంది. ఈక్వల్ పే అనే నినాదం ఎక్కువగా వినిపిస్తుంది. అంటే హీరోలతో సమానంగా హీరోయిన్లకు కూడా పారితోషికం ఇవ్వాల్సిందే అని. దీనికి కొందరు హీరోయిన్లు సపోర్ట్ చేస్తున్నారు..
మరికొందరు మాత్రం అది తప్పు అంటూ ఖండిస్తున్నారు. హీరోలతో సమానంగా పే అడగడం సమంజసం కాదు అంటూ కొందరు ముద్దుగుమ్మలు తమ అభిప్రాయాలను కారణాలతో సహా చెప్పేస్తున్నారు. హీరోలు ఫైట్స్ చేస్తారు.. డాన్సులు చేస్తారు.. ఇమేజ్తో సినిమాను నడిపిస్తుంటారు.. వాళ్ళతో సమానంగా తమకు కూడా అంతే పారితోషికం కావాలని కోరడం సమంజసం కాదంటూ కొందరు స్టార్ హీరోయిన్స్ బాహాటంగానే తమ అభిప్రాయం చెప్పారు.
అయితే మరికొందరు మాత్రం దీనికి నో చెప్తున్నారు. హీరోలకు అంత ఇస్తున్నపుడు.. ఎందుకు హీరోయిన్లకు ఇవ్వరు అంటూ భీష్మించుకుని కూర్చున్నారు. కంగనా రనౌత్, కరీనా కపూర్ లాంటి హీరోయిన్లు ఇందులో ముందు వరసలో ఉంటారు. హీరోలకు ఎంత ఇస్తున్నారో.. అంతే తమకు కూడా కావాలంటూ పట్టు పడుతున్నారు వాళ్లు. నిర్మాతలు ఈ విషయంలో తల పట్టుకుంటున్నారు.
ఇందులో నటించడానికి ఏకంగా 12 కోట్ల పారితోషికం అడుగుతుంది కరీనా కపూర్. నిర్మాత ఈ విషయంలో గుండె పగిలాడు.. అంత పారితోషికం ఏంట్రా బాబూ అంటూ ముక్కున వేలేసుకున్నాడు. అయితే దీనిపై ఇప్పుడు అసలు విషయాలు మాట్లాడుతుంది కరీనా. ఈక్వల్ పే డిమాండ్ను ఆమె ఈ సందర్భంగా తెరపైకి తీసుకొచ్చింది. అంటే హీరో హీరోయిన్ అనే తేడా లేకుండా అందరికీ ఒకేలా పారితోషికం ఇవ్వడం అన్నమాట.
అందుకే 12 కోట్లు అడిగాను అంటుంది కరీనా కపూర్. ఈక్వల్ పే డిమాండ్ చేయడంలో తప్పేముందని కరీనా ప్రశ్నిస్తుంది. 12 కోట్ల పారితోషికం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని చెప్పుకొచ్చింది కరీనా. బాలీవుడ్లో మరికొందరు హీరోయిన్లు కూడా ఇలాగే ఈక్వల్ పే డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు. కొన్నిసార్లు హీరోలతో సమానంగా హీరోయిన్లు కూడా కష్టపడుతుంటారు. అలాంటి సమయంలో వాళ్లకు కూడా అంతే పే ఇవ్వాల్సిందే అంటుంది కరీనా. తన ఒక్కదాని మాత్రమే కాదు.. అందరి కోసం ఈ రెమ్యునరేషన్ సమరం అంటుంది బెబో. మరి ఈమె మాటలు ఇండస్ట్రీలో మార్పులు తీసుకొస్తాయో లేదో చూడాలి.