బాలకృష్ణ 107వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.