బాలయ్య ఓ వైపు సినిమాల్లో అదరగొడుతూనే టాక్ షోలోను కేక పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ఆహా ఓటీటీ కోసం అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఓ టాక్ షోను చేస్తున్నారు. ఈ షో మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండో సీజన్ అక్టోబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్కు చంద్రబాబు, లోకేష్ వచ్చి అదరగొట్టారు. రెండో ఎపిసోడ్కు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, మూడో ఎపిసోడ్కు శర్వానంద్, అడివిశేష్ వచ్చి అలరించారు. నాల్గవ ఎపిసోడ్కు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాజ్యసభ ఎంపీ KR సురేష్ రెడ్డి వచ్చారు. ఇక లేటెస్ట్ ఐదో ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతోంది. ఈ ఎపిసోడ్కు అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి వచ్చారు. Photo : Twitter
ఇక ఆరవ ఎపిసోడ్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరవ ఎపిసోడ్కు ప్రముఖ తెలుగు నటీమణులు జయప్రద, జయసుధ వస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూట్ తాజాగా పూర్తి అయ్యిందని టాక్ నడుస్తోంది. ఈ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం ఆహాలో స్ట్రీమింగ్కు రానుందని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. Photo : Twitter
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుస సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ను జరుపుకుంటోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ డీల్ కూడా పూర్తి అయ్యినట్లు టాక్. అంతేకాదు ఈ సినిమా ఓటీటీ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ వీడియో దాదాపుగా 11 కోట్లు పెట్టి కొన్నట్లు లేటెస్ట్ టాక్. అయితే ఈ విషయంలో అధికారిక సమచారం తెలియాల్సి ఉంది. Photo : Twitter
ఇక ఆ సినిమా తర్వాత బాలయ్య 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య బాబు మునుపెన్నడు చూడని అవతార్లో కనిపించనున్నాడట. ఈ సినిమాలో యువ హీరోయిన్ ‘పెళ్లిసందD’ భామ శ్రీలీల డాటర్గా కనిపించనుంది. ఇక లేటెస్ట్గా ఈ సినిమా గురించి మరో వార్త హల్ చల్ చేస్తోంది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో విలన్గా హిందీ యాక్టర్ అర్జున్ రామ్పాల్ ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.. Photo : Twitter
అందులో భాగంగా ఆయన చేసిన అద్భుత చిత్రం “ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా భారతీయ చిత్రసీమలో అప్పట్లో ఓ సంచలనం. ఇక ఈ సినిమాకు ఎప్పటి నుంచో సీక్వెల్ రాబోతుందని టాక్ వినపడుతోంది. అంతేకాదు ఈ సినిమాకు స్వయంగా బాలయ్యే దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే తాజాగా ఈ సినిమా విషయంలో మరో అప్ డేట్ వచ్చింది. Photo : Twitter
ఈ సినిమాకు“ఆదిత్య 999 మ్యాక్స్” అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు తెలిపారు బాలయ్య. ఆయన ఆహాలో వస్తున్న తన టాక్ షోలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉండనుందో.. అంటూ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. బాలయ్య మరో మాస్ యాక్షన్ సినిమాను కూడా ఓకే చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవల మహేష్ బాబుతో సర్కారు వారి పాటను తెరకెక్కించిన పరశురామ్ పెట్లాతో ఓ సినిమాను చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Twitter
ఇక వీర సింహా రెడ్డి సినిమా విషయానికి వస్తే.. ఈసినిమా ఇప్పటికే దాదాపుగా 90 శాతం షూటింగ్ను పూర్తి చేసుకుందని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ యాక్షన్ డ్రామాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. Photo : Twitter
ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఈ సినిమా కు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయిందంట. ఇప్పటికే ఓ సారి బాలయ్యతో సినిమా చేయాలని చూసాడు అనిల్. నిజానికి ఆయన 100వ సినిమా కూడా అనిల్ రావిపూడి చేతుల్లో పెట్టాలని చూసాడు నిర్మాత దిల్ రాజు. అప్పట్లో ఈ కాంబినేషన్లో రామారావు గారు అనే సినిమా ప్రకటించారు కూడా. కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది.. Photo : Twitter
ఇక బాలయ్యతో చేస్తున్న సినిమాలో తన మార్క్ కామెడీ, కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ పుష్కలంగా ఉండనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పేరును కూడా చెప్పేశాడు అనిల్. ఇక బాలయ్య కూతురిగా ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీలా నటిస్తోందని అనిల్ తెలిపాడు. నిజానికి.. శ్రీలీలా పేరు తెరమీదకొచ్చినప్పుడు, ఆమె బాలయ్యతో జోడీ కట్టనుందేమోనని అంతా అనుకున్నారు. కానీ, ఆ వార్తల్ని ఖండిస్తూ కూతురిగా నటించనుందని అనిల్ క్లారిటీ ఇచ్చాడు. Photo : Twitter
మరోవైపు ఈ సినిమాలో బిగ్బాస్ ఓటీటీ తెలుగు విన్నర్ బిందు మాధవి కూడా ఈసినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు ఈ సినిమా గ్రాండ్ ఫినాలేలో అనిల్ రావిపూడి చెప్పారు. మరి బిందు మాధవికి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తాడా ? లేకపోతే వేరే ఏదైనా పాత్ర ఇస్తాడనేది చూడాలి. మొత్తంగా ప్రేక్షకులు మరిచిపోయిన బిందు మాధవికి అనిల్ రావిపూడి.. అది కూడా బాలయ్య సినిమాలో అవకాశం అంటే మాములు విషయం కాదు. మరి ఈ సినిమాతో బిగ్బాస్ బ్యూటీకి మరిన్ని అవకాశాలు వస్తాయా అనేది చూడాలి. Photo : Twitter
జనవరి 23, 2015న పటాస్ సినిమాతో వెండితెరకు డైరెక్టర్గా పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి. అయితే బాలయ్యను అనిల్ తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఇక ఈ చిత్రాన్నిషైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు. Photo : Twitter