నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా “వీరసింహా రెడ్డి” సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన అనిల్ రావిపూడితో ఓ సినిమాను చేయనున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ మార్చి 4నుంచి జరుగుతోంది. ఈ షూట్లో కాజల్ కూడా పాల్గోంటుంది. ఆచార్య తర్వాత కాజల్ నటిస్తున్న తెలుగు సినిమా ఇదే. Photo : Twitter
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో బాలయ్య పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. అయితే ఇదే పండుగకు రామ్ పోతినేని బోయపాటి సినిమా, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. Photo : Twitter
ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో రావడమేకాదు.. ఓ ఆరు భాషల్లో విడుదలకానుందని సమాచారం. వీర సింహా రెడ్డి హిట్ తర్వాత బాలయ్య 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తుండడంతో భారీగా అంచనాలున్నాయి. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా అయ్యిందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా విషయంలో ఓ కీలక విషయం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు బాలయ్య సినిమాలు దాదాపుగా రాయలసీమ నేపథ్యంలోనే సాగేవి. అయితే ఈ సినిమా మాత్రం తెలంగాణ నేపథ్యంలో రానుందని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. Photo : Twitter
ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ నటి నోరా ఫతేహిను తీసుకోవాలని చూస్తున్నారట. ఈ భామ ఈ సినిమాలో నెగిటివ్గా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు బాలయ్య, నోరా ఫతేహి కాంబినేషన్లో వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్గా ఉంటాయని అంటున్నారు. ఇక నోరా గతంలో బాహుబలి సినిమాలో మనోహరి అనే పాటలో తన అందచందాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. Photo : Twitter
అంతేకాదు ఈ సినిమా బాలయ్య సినిమాల్లో చాలా భిన్నంగా ఉండనుందని టాక్. చూడాలి మరి ఎలా ఆకట్టుకోనుందో.. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా వీరసింహా రెడ్డిలో మీనాక్షి పాత్రలో సీనియర్ బాలయ్యసరసన నటించిన హనీరోజ్ నటించనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్కు ఛాన్స్ ఉండడంతో ఫస్ట్ హీరోయిన్గా కాజల్ ను తీసుకుంటున్నారట. (Photo Twitter)
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందట. అయితే ఎంత పవర్ ఫుల్ గా ఉన్నా.. మరోవైపు ఆ పాత్ర తాలూకు ప్రవర్తన, మాటలు వెరీ ఫన్నీగా ఉంటాయట. ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రి కూతురు మధ్య మంచి ఎమోషనల్ ట్రాక్ ఉంటుందట. ఇదే ఈ సినిమాకు ఆయువు పట్టు అని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, బాలయ్య కూతురుగా చేస్తోంది. (Photo Twitter)
ఇక మరోవైపు ఆదిత్య 369ఈ సినిమాకు ఎప్పటి నుంచో సీక్వెల్ రాబోతుందని టాక్ వినపడుతోంది. అంతేకాదు ఈ సినిమాకు స్వయంగా బాలయ్యే దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తోంది. ఈ సినిమాకు“ఆదిత్య 999 మ్యాక్స్” అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు తెలిపారు బాలయ్య. ఆయన ఆహాలో వస్తున్న తన టాక్ షోలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉండనుందో.. అంటూ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. Photo : Twitter
వీరసింహారెడ్డి విషయానికి వస్తే.. అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి అనే సినిమాను చేశారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా జనవరి 12న భారీగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. టీజర్స్ అండ్ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్స్ ఓ రేంజ్లో వచ్చాయి. Photo : Twitter
వీరసింహారెడ్డి’ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. నిన్నటి ఈ సినిమా 8 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్బులో చేరింది. అఖండ తర్వాత రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరిన రెండో బాలయ్య చిత్రంగా వీరసింహారెడ్డి రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతేకాదు బాలయ్య కెరీర్లో వీరసింహారెడ్డి ఓ అరుదైన రికార్డ్ను క్రియేట్ చేసింది. Photo : Twitter
బాలయ్య గత సినిమా “అఖండ” ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ చిత్రం అందుకున్న టోటల్ వసూళ్ళని వీరసింహా రెడ్డి కేవలం ఈ 8 రోజుల్లోనే కలెక్ట్ చేసి అదరహో అనిపించింది. దీనితో వీరసింహా రెడ్డి బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు వీర సింహారెడ్డి విడుదలైన 3 రోజుల్లోనే USAలో బ్రేక్ఈవెన్ మార్క్ను చేరుకుంది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్గా 70 కోట్లకు పైగా షేర్ను వసూలు చేసి వావ్ అనిపించింది.. Photo : Twitter
అఖండ సినిమా మొదటి వారం రూ. 53.49 కోట్ల షేర్ (రూ. 87.9 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధిస్తే.. వీరసింహారెడ్డి మూవీ 1 వారంలోనే రూ. 68.51 కోట్ల షేర్ (రూ. 114.95 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి మంచి అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు కూడా అదే దూకుడుతో బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తోంది. ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ యూస్ డాలర్స్ను కలెక్ట్ చేసి 2 మిలియన్ క్లబ్బు వైపు పరుగులు తీస్తోంది. (Photo : Twitter
ఇక ఈ సినిమా విజయవంతంగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య .. వీరసింహారెడ్డిగా.. జైసింహారెడ్డిగా తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఈయన ద్విపాత్రాభినయం చేసిన 17వ చిత్రం. ఈయన చెల్లెలు కమ్ మేనత్త పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ పాత్రలో నటించారు. (Twitter/Photo)
ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో కూడా లెజెండ్ తరహాలో పొలిటికల్ డైలాగులు పేలాయి. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ ఎటాక్ చేసారు. సంతకాలు పెడితే బోర్డు పై పేరు మారుతుందేమో... ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారుదు.. మార్చలేరు అంటూ.. రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై సెటైర్లు వేసారు బాలయ్య. ఈ డైలాగులకు థియేటర్స్లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ హాట్ స్టార్ దక్కించుకుంది. హాట్ స్టార్ బాలయ్య వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ను దాదాపుగా రూ. 14కోట్లు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య గత చిత్రం అఖండ స్ట్రీమింగ్ రైట్స్ కూడా హాట్ స్టార్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే.. Photo : Twitter
ఇక బాలయ్య ఓ వైపు సినిమాల్లో అదరగొడుతూనే టాక్ షోలోను కేక పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఆహా ఓటీటీ కోసం అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఓ టాక్ షోను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండో సీజన్ అక్టోబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్కు చంద్రబాబు, లోకేష్ వచ్చి అదరగొట్టారు. రెండో ఎపిసోడ్కు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చారు. ఇక మూడో ఎపిసోడ్కు శర్వానంద్, అడివిశేష్ వచ్చి అలరించారు. Photo : Twitter
నాల్గవ ఎపిసోడ్కు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాజ్యసభ ఎంపీ KR సురేష్ రెడ్డి వచ్చారు. ఐదో ఎపిసోడ్కు అల్లు అరవింద్, కోదండ రామిరెడ్డి, రాఘవేంద్రరావులు వచ్చారు. ఇక ఆరో ఎపిసోడ్కు ప్రభాస్, గోపీచంద్ వస్తున్నారు. ఈ బాలయ్య, ప్రభాస్ల ఎపిసోడ్ రెండు పార్ట్లుగా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే మొదటి పార్ట్ డిసెంబర్ 29 రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్కు వచ్చింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా అందరూ స్ట్రీమ్ చేయడంతో వచ్చిన అరగంటలోపే సర్వర్ క్రాష్ అయ్యింది. దీంతో ఆహా యాప్ కొన్ని గంటల వరకు పనిచేయలేదు. Photo : Twitter