సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్లో సినిమా వస్తుందంటే.. ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి క్రేజీ కాంబినేషన్ బాలకృష్ణ, అనిల్ రావిపూడి.. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఎఫ్ 3 మూవీ తర్వాత అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీ బాలయ్యతో చేయబోతున్నట్టు చెప్పడమే కాదు. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను ఎఫ్ 3 మూవీ విడుదల సందర్భంగా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
బాలయ్య ఓ వైపు సినిమాల్లో అదరగొడుతూనే టాక్ షోలోను కేక పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఆహా ఓటీటీ కోసం అన్స్టాపబుల్ విత్ NBK అంటూ ఓ టాక్ షోను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండో సీజన్ అక్టోబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్కు చంద్రబాబు, లోకేష్ వచ్చి అదరగొట్టారు. రెండో ఎపిసోడ్కు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చారు. ఇక మూడో ఎపిసోడ్కు శర్వానంద్, అడివిశేష్ వచ్చి అలరించారు. నాల్గవ ఎపిసోడ్కు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాజ్యసభ ఎంపీ KR సురేష్ రెడ్డి వచ్చారు. ఇక ఐదో ఎపిసోడ్కు అల్లు అరవింద్, సురేష్ బాబు, కోదండ రామిరెడ్డి, రాఘవేంద్రరావులు వచ్చారు. Photo : Twitter
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుస సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గోపీచంద్ మలినేనితో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాను చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. జనవరి 12, 2023 న ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కానుంది. ఇక అది అలా ఉంటే ఆ సినిమా తర్వాత బాలయ్య 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్న సంగతి తెలిసిందే. Photo : Twitter
ఇక ఈ సినిమా కథ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం ముప్పై ఐదేళ్ల వయసులో ఉన్న హీరో.. ఆ సమయంలో ఆవేశంలో చేసిన ఓ గొడవ కారణంగా హీరోకి 14 ఏళ్ల పాటు శిక్ష పడుతుందట. ఈ నేపథ్యంలో ఏభై ఏళ్ల తర్వాత విడుదలైన హీరో ఏం చేశాడు.. అప్పుడు హీరో ఎదుర్కోనోన్న సమస్యలు ఏంటీ వంటి అంశాలతో కథ అల్లు కున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్గా హిందీ యాక్టర్ అర్జున్ రామ్పాల్ ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.. Balakrishna Vishwak Sen (Photo Twitter)
ఇప్పటికే ఓ సారి బాలయ్యతో సినిమా చేయాలని చూసాడు అనిల్. నిజానికి ఆయన 100వ సినిమా కూడా అనిల్ రావిపూడి చేతుల్లో పెట్టాలని చూసాడు నిర్మాత దిల్ రాజు. అప్పట్లో ఈ కాంబినేషన్లో రామారావు గారు అనే సినిమా ప్రకటించారు కూడా. కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. ఇక బాలయ్యతో ఇపుడు చేయబోయే సినిమా కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది. రెండోది..
ఈ సినిమాలో బాలయ్య సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను ఫైనల్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈమెకు అంతగా అవకాశాలు లేవు. గతంలో ఈమె దక్షిణాదిలో రజినీకాంత్ ‘లింగ’ లో పెద్ద రజినీకాంత్కు జోడిగా నటించింది. మళ్లీ ఇన్నాళ్లకు బాలయ్య సినిమాలో నటించడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడనుంది.ముందుగా తమన్నా, మెహ్రీన్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. అటు సోనాక్షి పేరు వచ్చి చేరింది. (Twitter/Photo)
తాజాగా బాలయ్య అనిల్ రావిపూడి సినిమాలో ప్రియాంక జవాల్కర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. బాలయ్య సినిమాకు బల్క్ డేట్స్ ఇచ్చే హీరోయిన్ కోసం చూస్తున్నారు. ఈ కోవలో ప్రియాంక జవాల్కర్ చేతిలో సరైన అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి .. ఈమె పేరును పరిశీలించినట్టు సమాచారం. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటారా.. ఒకరు ఉంటారా అనేది చూడాలి. (Twitter/Photo)
ఇక ఈ సినిమాలో హీరోయిన్ పేరును కూడా చెప్పేశాడు అనిల్. ఇక బాలయ్య కూతురిగా ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీలా నటిస్తోందని అనిల్ తెలిపాడు. శ్రీలీల అయితేనే ఈ సినిమాకు బావుంటుందని.. ఆమె మాత్రం ఆ పాత్రకు న్యాయం చేస్తుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు., అందుకే ఏరికోరి మరీ శ్రీలీలాని తీసుకున్నామని అనిల్ చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రాన్నిషైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు. ఇక మరోవైపు ఆదిత్య 369ఈ సినిమాకు ఎప్పటి నుంచో సీక్వెల్ రాబోతుందని టాక్ వినపడుతోంది. అంతేకాదు ఈ సినిమాకు స్వయంగా బాలయ్యే దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తోంది. (Twitter/Photo)
ఇక సినిమాల విషయానికి వస్తే.. బాలయ్య మరో మాస్ యాక్షన్ సినిమాను కూడా ఓకే చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవల మహేష్ బాబుతో సర్కారు వారి పాటను తెరకెక్కించిన పరశురామ్ పెట్లాతో ఓ సినిమాను చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Twitter