గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ తో ఫుల్ ఫామ్లోకి వచ్చిన తర్వాత వరుసగా క్రేజీ దర్శకులతోనే వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 సినిమా చేస్తున్నారు. ఈయన బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈయన దిల్ రాజు నిర్మాణంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. (Twitter/Photo)
ఇక దిల్ రాజు కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య, చిరంజీవి తప్ప మిగిలిన సీనియర్, యంగ్ హీరోలతో సినిమాలు నిర్మించిన ట్రాక్ రికార్డు ఉంది.ఒక్కోసారి ఆయన నిర్ణయం ఫ్యాన్స్ను భయపెట్టిన సందర్భాలున్నాయి. బాలకృష్ణ ఎవరు ఊహించని విధంగా మెగా ఫ్యామిలీకి చెందిన ‘ఆహా’ ఓటీటీకి హోస్ట్గా చేయడానికి ఓకే చెప్పడం ఎవరు ఊహించి ఉండరు. (Twitter/Photo)
అదే కోవలో ‘అఖండ’తో భారీ సక్సెస్ను అందుకున్న బాలయ్య.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ను గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి క్రేజీ డైరెక్టర్స్తో చేయడానికి ఓకే చెప్పారు. ఇక ఆహా ఓటీటీలో తనను అందరికీ దగ్గరయ్యేలా చేసిన ఆ షో డైరెక్టర్ బీవీఎష్ రవికి బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్ట్కు ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. (Twitter/Photo)
అదే రూట్లో బీవీఎస్ రవి.. బాలకృష్ణ కోసం అద్భుతమైన కథను రెడీ చేసినట్టు సమాచారం.. అంతేకాదు ఈ స్టోరీని బాలయ్యకు వినిపించి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. ఆయన విని ఇంప్రెస్ అయ్యారట. రచయతగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పనిచేసిన బీవీఎస్ రవి.. దర్శకుడిగా చేసిన ‘వాంటెడ్, జవాన్ చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయినా.. ఆహా లో అన్స్టాపబుల్ షోను సక్సెస్ఫుల్ చేసిన ఈ దర్శకుడికి నెక్ట్స్ ఛాన్స్ ఇవ్వడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. (Twitter/Photo)
బాలకృష్ణ, బీవీఎస్ రవి కాంబినేషన్లో తెరకెక్కే చిత్రాన్ని దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈయన దగ్గర బీవీఎస్ రవి డేట్స్ కూడా ఉన్నాయి. తాజాగా ఈయన బాలకృష్ణ డేట్స్ సంపాదించారు. ఇక బాలయ్యతో సినిమా నిర్మించాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ కోవలో ఈ కాంబినేషన్ను దిల్ రాజు సెట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా దసరా కానుకగా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. (Twitter/Photo)
‘అఖండ’ తర్వాత బాలకృష్ణ తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు నల్ల డ్రెస్లో ఉన్న బాలయ్య లుక్ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
బాలకృష్ణతో చేయబోయే సినిమాను గోపీచంద్ మలినేని తనదైన యాక్షన్ బ్యాక్డ్రాప్కు రియలిస్టిక్ స్టోరీతో పల్నాడు బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో బాలయ్య మరోసారి ఫ్యాక్షన్ లీడర్గా, పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ‘వేట పాలెం’ తో పాటు ‘పెద్దాయన’, అన్నగారు అనే టైటిల్స్ పరిశీలినలో ఉన్నాయి. (Twitter/Photo)
గోపీచంద్ మలినేని సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్టు అభిమానులతో బాలయ్య కన్ఫామ్ చేసారు. గతంలో అనిల్ రావిపూడి బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే ఆయనకి ఒక కథను వినిపించాడట. అప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. కానీ అనిల్ రావిపూడి అదే కథను కొన్ని మార్పులతో బాలయ్యను ఒప్పించారు. ఈ విషయాన్ని బాలయ్య టాక్ షోలో అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించారు. (Twitter/Photo)
ఇక బాలయ్య కూడా పూరీతో సినిమా అంటే చేస్తానని ఎన్నోసార్లు చెప్పారు. విజయ్ దేవరకొండ తో చేస్తోన్న లైగర్ ఆ తర్వాత ‘జనగణమన’ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత బాలయ్య, పూరీ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. కొన్ని రోజుల క్రితం గోవాలో పూరీ చెప్పిన కథకు బాలయ్య ఓకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు రీసెంట్గా అన్స్టాపబుల్ షోలో మరోసారి పూరీ జగన్నాథ్ కన్ఫామ్ చేసారు. కానీ ఈచిత్రం విజయ్ దేవరకొండ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లే చాన్సెస్ ఉన్నాయి. ( Balakrishna in Liger sets Photo : Twitter)
అటు బాలయ్య, కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఒక వేళ వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అభిమానులకు పండగే. ఆచార్య తర్వాత కొరటాల ఇపుడు ఎన్టీఆర్ సినిమా ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ చేయనున్నారు. ఆ తర్వాత వీళ్లిద్దరి సినిమా ఉండే అవకాశం ఉంది. (Twitter/Photo)
బాలయ్యతో ఎవరు ఊహించని విధంగా ‘ఆహా’ టాక్ షోకు హోస్ట్గా ఒప్పించిన అల్లు అరవింద్.. తన ఓన్ బ్యానర్ గీతా ఆర్ట్స్లో బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ భారీ సినిమాకు ప్లాన్ చేసినట్టు సమాచారం. కానీ అల్లు అరవింద్.. కళ్యాణ్ రామ్తో ‘బింబిసార’ సినిమాను తెరకెక్కిస్తోన్న మల్లిడి వేణు దర్శకత్వంలో సినిమా నిర్మించాలనే ప్లాన్లో ఉన్నారు.
త్వరలో గీతా ఆర్ట్స్లో బాలయ్య హీరోగా మల్లిడి వేణు దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా సినిమాను అఫీషియల్గా ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నిర్మాత ఇపుడు అది కూడా మెగా హీరోలకు మెయిన్ కాంపీటీటర్ అయిన నందమూరి హీరోతో సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం ఖాయం అనే చెప్పాలి. ఇప్పటి వరకు గీతా ఆర్ట్స్లో అక్కినేని హీరోలైన ‘ఏఎన్నార్, నాగ చైతన్య, అఖిల్ నటించారు. కానీ నందమూరి హీరోలెవరు ఈ బ్యానర్లో నటించలేదు. ఇపుడు బాలయ్య హీరోగా అల్లు అరవింద్ సినిమా తీసి నందమూరి హీరోలతో సినిమా తీయలేదన్న లోటును పూరించుకోనున్నారు. (Twitter/Photo)
మరోవైపు బాలకృష్ణ.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్లో ఓ సినిమా చేయనున్నట్టు చెప్పారు. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేసేది మాత్రం చెప్పలేదు. ఈ సినిమా హారికా అండ్ హాసిని క్రియేషన్స్లో తెరకెక్కుతుందా.. లేదా సితార ఎంటర్ట్మెంట్లో సెట్స్ పైకి వెళ్లనుందా అనేది చూడాలి. ఒకవేళ హారికా అండ్ హాసిని అంటే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్ బోయపాటితోనే బాలయ్య సినిమాను ప్లాన్ చేసినట్టు సమాచారం. (Twitter/Photo)
సీటీమార్ సినిమాతో తనలోని యాక్షన్ యాంగిల్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది బాలయ్య జత కట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సంపత్ నంది స్వయంగా వెల్లడించడం విశేషం. అయితే సంపత్ నంది వేములవాడ దేవాలయానికి వెళ్లి స్క్రిప్ట్ కాపీని శ్రీ రాజ రాజేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపాడు
అటు ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులను తన పేరుతోనే అలరించిన దర్శకుడు ఎస్వీ కృష్టారెడ్డి. తాజాాగా ఈయన బాలయ్యను కలిసి ఓ కథను వినిపించినట్టు సమాచారం. దానికి బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. గతంలో వీరిధ్దరి కాంబినేషన్లో ‘టాప్ హీరో’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా అంతగా అలరించలేకపోయింది. మరి ఇపుడు వీళ్లిద్దరి కాంబినేషన్ అసలు వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. (File/Photo)
మరోవైపు బాలకృష్ణ.. క్లాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాలతో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈయన కెరీర్లో ‘కొత్త బంగారు లోకం’, వెంకటేష్, మహేష్ బాబులతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలు మాత్రమే సక్సెస్ అందుకున్నాయి. ఆ తర్వాత చేసిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా డిజాస్టర్గా నిలిచింది. గతేడాది వెంకటేష్తో ‘నారప్ప’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ సినిమా తమిళంలో హిట్టైన ధనుశ్ ‘అసురన్’ సినిమాను సేమ్ టూ సేమ్ కాపీ పేస్ట్ చేసాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఓటీటీలో విడుదలైన సందర్భంగా నారప్ప హిట్ టాక్ తెచ్చుకుంది. అదే థియేటర్స్లో విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే చాన్సెస్ తక్కువ ఉండేదనేది వాదన కూడా వినిపించింది. (Twitter/Photo)
ఒకవైపు శ్రీకాంత్ అడ్డాలతో పాటు నందమూరి నట సింహా దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావుతో మరో చారిత్రక సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి శ్రీ వైష్ణవ మతాచార్యులు..ద్వైత మత సిద్ధాంతకర్త...అష్టాక్షరీ మంత్రాన్ని అందరికీ పంచిన రామానుజ చార్యులుగా నటిస్తున్నట్టు సమాచారం. (File/Photo)
గతంలో బాలయ్య ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా అది కూడా తన అరవై యేళ్లు వచ్చినపుడు ఈ క్యారెక్టర్ చేస్తా అని చెప్పారు. అందుకు తగ్గట్టు ఇపుడు బాలయ్య ఈ పాత్ర చేయడానికి రెడీ అయినట్టు సమాచారం. ఇప్పటికే జె.కే.భారవి ఈ సినిమా కథ అంతా రెడీ చేసినట్టు సమాచారం. ఇక రామానుజాచార్యులు వంటి ఉదాత్తమైన పాత్రలు స్టార్ హీరోలు చేసేది రేర్ కాబట్టి ఇటువంటి సినిమాల రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. రాఘవేంద్రరావు ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. త్వరలో ఈ సినిమా విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.Twitter/Photo)
బాలకృష్ణ, కే.రాఘవేంద్రరావు కాంబినేషన్లో పలు చిత్రాలు వచ్చినా.. ఏవి పెద్దగా బ్లాక్ బస్టర్స్ నమోదు చేయలేదు. పైగా ఈయన ఇపుడు ఫామ్లో లేరు. మరి ఫామ్లో లేని దర్శకుడితో బాలయ్య అది కూడా రామానుజాచార్యులు వంటి చారిత్రక మహాత్ముల పాత్ర చేస్తుండంతో ఫ్యాన్స్ మాత్రం రిస్క్తో కూడుకున్న వ్యవహారం అని భయపెడుతున్నారు.
మొత్తంగా నందమూరి నట సింహం వరుసగా క్రేజీ దర్శకులతో పాటు ఔట్ డేటెడ్ దర్శకులతో నెక్ట్త ప్రాజెక్ట్లతో పలకరించనున్నారు. ఇందులో గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్,అల్లు అరవింద్తో ఆదిత్య 999 సినిమాలు సినిమాలు ఓకే అయ్యాయి. మిగతా దర్శకులతో ఈయన సినిమాలపై అఫీషియల్ ప్రకటనలు వెలుబడాల్సి ఉంది. (Twitter/Photo)