బాలయ్య ఓ వైపు సినిమాల్లో అదరగొడుతూనే టాక్ షోలోను కేక పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఆహా ఓటీటీ కోసం అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఓ టాక్ షోను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండో సీజన్ అక్టోబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్కు చంద్రబాబు, లోకేష్ వచ్చి అదరగొట్టారు. రెండో ఎపిసోడ్కు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చారు. ఇక మూడో ఎపిసోడ్కు శర్వానంద్, అడివిశేష్ వచ్చి అలరించారు. నాల్గవ ఎపిసోడ్కు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాజ్యసభ ఎంపీ KR సురేష్ రెడ్డి వచ్చారు. Photo : Twitter
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుస సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ను జరుపుకుంటోంది. ఇక అది అలా ఉంటే ఇక ఆ సినిమా తర్వాత బాలయ్య 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్న సంగతి తెలిసిందే. Photo : Twitter
ఇక ఈ సినిమా కథ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం ముప్పై ఐదేళ్ల వయసులో ఉన్న హీరో.. ఆ సమయంలో ఆవేశంలో చేసిన ఓ గొడవ కారణంగా హీరోకి 14 ఏళ్ల పాటు శిక్ష పడుతుందట. ఈ నేపథ్యంలో ఏభై ఏళ్ల తర్వాత విడుదలైన హీరో ఏం చేశాడు.. అప్పుడు హీరో ఎదుర్కోనోన్న సమస్యలు ఏంటీ వంటి అంశాలతో కథ అల్లు కున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 8న హైదరాబాద్లో ప్రారంభం కానుందని టాక్. ఈ సినిమాలో విలన్గా హిందీ యాక్టర్ అర్జున్ రామ్పాల్ ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.. Balakrishna Vishwak Sen (Photo Twitter)
ఇక మరోవైపు ఆదిత్య 369ఈ సినిమాకు ఎప్పటి నుంచో సీక్వెల్ రాబోతుందని టాక్ వినపడుతోంది. అంతేకాదు ఈ సినిమాకు స్వయంగా బాలయ్యే దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తోంది. ఈ సినిమాకు“ఆదిత్య 999 మ్యాక్స్” అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు తెలిపారు బాలయ్య. ఆయన ఆహాలో వస్తున్న తన టాక్ షోలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉండనుందో.. అంటూ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. Photo : Twitter
ఇక సినిమాల విషయానికి వస్తే.. బాలయ్య మరో మాస్ యాక్షన్ సినిమాను కూడా ఓకే చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవల మహేష్ బాబుతో సర్కారు వారి పాటను తెరకెక్కించిన పరశురామ్ పెట్లాతో ఓ సినిమాను చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Twitter
అఖండ తర్వాత బాలకృష్ణ హీరోగా వీర సింహా రెడ్డి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 75 శాతం షూటింగ్ను పూర్తి చేసుకుందని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ యాక్షన్ డ్రామాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. Photo : Twitter
గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ సక్సెస్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో వరుసగా క్రేజీ డైరెక్టర్స్తో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా గుంటూరులోని రామకృష్ణ థియేటర్లో 175 పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమా తర్వాత ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. Photo : Twitter
ఈ సినిమా ఆగష్టు చివరి వారం వరకు కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు బాలయ్య. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా సత్తా చూపెడుతున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ పాత్రతో పాటు పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నట్టు సమాచారం.ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఈ సినిమా కు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయిందంట. Photo : Twitter
ఇప్పటికే ఓ సారి బాలయ్యతో సినిమా చేయాలని చూసాడు అనిల్. నిజానికి ఆయన 100వ సినిమా కూడా అనిల్ రావిపూడి చేతుల్లో పెట్టాలని చూసాడు నిర్మాత దిల్ రాజు. అప్పట్లో ఈ కాంబినేషన్లో రామారావు గారు అనే సినిమా ప్రకటించారు కూడా. కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. ఇక బాలయ్యతో ఇపుడు చేయబోయే సినిమా కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది... Photo : Twitter
ఇక బాలయ్యతో చేస్తున్న సినిమాలో తన మార్క్ కామెడీ, కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ పుష్కలంగా ఉండనున్నట్టు అనిల్ రావిపూడి ఖరారు చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ పేరును కూడా చెప్పేశాడు అనిల్. ఇక బాలయ్య కూతురిగా ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీలా నటిస్తోందని అనిల్ తెలిపాడు. శ్రీలీల అయితేనే ఈ సినమాకు బావుంటుందని.. ఆమె మాత్రం ఆ పాత్రకు న్యాయం చేస్తుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు., అందుకే ఏరికోరి మరీ శ్రీలీలాని తీసుకున్నామని అనిల్ చెప్పుకొచ్చాడు. Photo : Twitter
మరోవైపు ఈ సినిమాలో బిగ్బాస్ ఓటీటీ తెలుగు విన్నర్ బిందు మాధవి కూడా ఈసినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు ఈ సినిమా గ్రాండ్ ఫినాలేలో అనిల్ రావిపూడి చెప్పారు. మరి బిందు మాధవికి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తాడా ? లేకపోతే వేరే ఏదైనా పాత్ర ఇస్తాడనేది చూడాలి. మొత్తంగా ప్రేక్షకులు మరిచిపోయిన బిందు మాధవికి అనిల్ రావిపూడి.. అది కూడా బాలయ్య సినిమాలో అవకాశం అంటే మాములు విషయం కాదు. మరి ఈ సినిమాతో బిగ్బాస్ బ్యూటీకి మరిన్ని అవకాశాలు వస్తాయా అనేది చూడాలి. Photo : Twitter
బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇది ముగిసిన వెంటనే, అనిల్ రావిపూడితో సెట్స్ మీదకి వెళ్లనున్నారు. బాలయ్య ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో లెజెండ్ సీక్వెల్ తీసేందుకు కూడా నందమూరి బాలయ్య రెడీ అయ్యాడు. ఇందులో కూడా బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. Photo : Twitter
జనవరి 23, 2015న పటాస్ సినిమాతో వెండితెరకు డైరెక్టర్గా పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి. అయితే బాలయ్యను అనిల్ తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఇక ఈ చిత్రాన్నిషైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు. Photo : Twitter