బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా అఖండ టెలివిజన్ ప్రిమియర్గా తాజాగా టీవీలో ప్రసారం అయ్యింది. ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా.. అఖండ సినిమాను ఏప్రిల్ 10న సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం చేసింది. కాగా తాజాగా దీనికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. ఈ చిత్రానికి 13.3 టీఆర్పీ వచ్చింది. అయితే ఈ రేటింగ్ అఖండకు చాలా తక్కువని అంటున్నారు ఫ్యాన్స్. దీనికి కారణం ఐపీయల్ కావోచ్చని అంటున్నారు. Photo : Twitter
అఖండ హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థకు విక్రయించింది చిత్రబృందం. కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ నుంచి రూ. 20 కోట్లను అందాయని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాను హిందీలో రీమేక్ కూడా చేస్తున్నారని.. ఈ రీమేక్లో అక్షయ్ లేదా అజయ్ దేవగన్ నటిస్తారని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రం కూడా మంచి విజయం దక్కించుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం.. . Photo : Twitter
క్రాక్ డైరక్టర్ గోపీచంద్ (Gopichand)దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.బాలకృష్ణ, గోపిచంద్ మలినేని సినిమాలో అల్లు అర్జున్ ఫాదర్ ప్రతినాయకుడి పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నారు. ‘అఖండ’ సక్సెస్తో ఇండస్ట్రీ బడా హీరోలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. Photo : Twitter
గతేడాది చివర్లో బాలయ్య.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ (Akhanda)సక్సెస్తో ఫుల్ జోష్లో ఉండరు. బాలయ్య పనైపోయిందన్న వాళ్లకు ఈ సినిమా సక్సెస్తో సమాధానం ఇచ్చారు. మంచి కథ పడితే.. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య రచ్చ ఏ విధంగా ఉంటుందో ‘అఖండ’తో మరోసారి ప్రూవ్ అయింది. ‘అఖండ’ సక్సెస్తో ఇండస్ట్రీ బడా హీరోలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా 20థియేటర్స్లో 100 రోజులు పూర్తి చేసుకుని ఈ డిజిటల్ యుగంలో వంద రోజుల పోస్టర్తో సంచలనం రేపింది. పెద్ద సినిమాలు రిలీజైతే.. ప్రేక్షకులు థియేటర్స్కు వస్తారా రారా అన్న అనుమానాలు ‘అఖండ’ మాస్ జాతరతో పటా పంచలైపోయాయి... Photo : Twitter
ఆ సంగతి పక్కన పెడితే.. ‘అఖండ’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా పేర్కొంది. మొత్తంగా రూ. 95 కోట్ల షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ‘అఖండ’ మూవీ హాట్ స్టార్లో స్ట్రీమింగ్కు వచ్చింది. అక్కడ కూడా ఎక్కువ మంది చూసిన సినిమా ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.. Photo : Twitter
అఖండ’ సక్సెస్ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సిరిసిల్లలో ప్రారంభమైంది అక్కడ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైయింది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా సిరిసిల్లలో ఫైట్ సీక్వెన్స్తో ప్రారంభమైంది. ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో దునియా విజయ్.. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన లుక్ను కూడా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.. Photo : Twitter
మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ను తీసుకున్నారు.ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇక క్రాక్లో కథానాయికగా నటించిన శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్లో బ్లాక్ లుంగీలో పక్కన పెద్ద బండి పక్కన ఎంతో మాస్గా ఉంది.