పుష్ప మొదటి భాగంతో అటు అల్లు అర్జున్, ఇటు రష్మిక మందన్న పాన్ ఇండియా క్రేజ్ కొట్టేశారు. బీటౌన్ లో కూడా పాపులర్ అయ్యారు. బన్నీ మాస్ లుక్కి తోడు రష్మిక మందన్న స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసింది. రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర నార్త్ లో ఆమె క్రేజ్ రెట్టింపు చేసింది.
బన్నీ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాను 2024లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట మేకర్స్. పుష్ప మొదటి భాగంలో శ్రీవల్లిగా కనిపించి యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ రష్మిక మందన్నకు ఈ సినిమాలో స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నా కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా సుకుమార్ ప్లాన్ చేసుకున్నట్లు ఇన్ సైడ్ టాక్.