సర్కారు వారి పాట సక్సెస్ తర్వాత మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా... షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రిద్దరి కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రెడీ అవుతోంది. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్ అయ్యారు.
ఎపుడెపుడా ఎదురు చూస్తున్న మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరిగిపోతుంది. మధ్యలో కాస్త బ్రేకులు పడినా మళ్లీ సినిమాను త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ’సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ బాబు.. ‘అల వైకుంఠపురములో’ తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. (Twitter/Photo)
అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాను త్రివిక్రమ్ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ వార్త ఒకటి వైరల్ అవుతోంది.
ఇక మహేష్ తాాజా సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ఫ్లాష్ బ్యాక్తో పాటు ప్రస్తుతం జరిగే సీన్స్ను వెరైటీ స్క్రీన్ ప్లే తో త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇందులో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే మహేష్ బాబు సన్నివేశాలే ఈ సినిమాకు హైలెట్ కానున్నాయట. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మరో కథానాయికగా శ్రీలీల నటించబోతున్నట్టు సమాచారం. (Twitter/Photo)