ఎప్పట్నుంచో బాలయ్య అభిమానులు వేచి చూస్తున్న అఖండ ట్రైలర్ వచ్చేసింది. విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్లో సంచలనాలు రేపుతుంది ఈ ట్రైలర్. ఇందులో బాలయ్య డైలాగులు కూడా అదిరిపోయాయి. అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా.. పట్టుసీమ తూమా.. ఒకమాట నువ్వంటే శబ్ధం.. అదే మాట నేనంటే శాసనం.. దైవ శాసనం.. ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్డోజర్ని.. తొక్కిపారదొబ్బుతా.. అంటూ తనదైన శైలిలో రచ్చ చేస్తున్నాడు నందమూరి నటసింహా బాలకృష్ణ (Nandamuri Balakrishna).
బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఉగాది సందర్భంగా విడుదలైన ’అఖండ’(Akhanda) టైటిల్ పోస్టర్తో పాటు టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అంతేకాదు టాలీవుడ్లో తక్కువ టైమ్లో 50M వ్యూస్ క్రాస్ చేసిన టీజర్గా బాలకృష్ణ ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ‘అఖండ’ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నారు. ఒకటి కలెక్టర్ పాత్ర అయితే. .రెండోది ఫ్యాక్షనిస్ట్, మూడోది అఘోర అని ఈ సినిమా పోస్టర్స్ బట్టి అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే ‘అఖండ’ మూవీ నుంచి విడుదల చేసిన రెండు పాటలక మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. మరో కీలక పాత్రలో పూర్ణ నటిస్తుంది. ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయబోతున్నారు. ‘అఖండ’ సినిమా విషయానికొస్తే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర ప్రదేశ్ హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి.
తెలంగాణ (నైజాం) ప్రాంతం రూ. 10 కోట్లుకు అమ్మడుపోయినట్టు సమాచారం. ఇక రాయలసీమ (సీడెడ్) హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. ‘అఖండ’ సినిమా తర్వాత బాలయ్య.. గోపీచంద్ మలినేనితో తర్వాత సినిమా చేయనున్నారు.
ఈ మధ్యే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరో కథానాయికగా భావన పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. పల్నాడు బ్యాక్ డ్రాప్లో నిజ జీవిత కథ నేపథ్యంలో గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.