నందమూరి నటసింహం బాలయ్య తాజాగా నటించిన సినిమా అఖండ.. అఖండ విజయాన్ని అందుకుంది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ మంచి లాభాలను తెచ్చింది. దీంతో అఖండ టీమ్ తాజాగా హైదరాబాద్లో అఖండ సంబరాలు అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో పాల్గోన్న బాలయ్య అన్ సీజన్లో ‘అఖండ’ చిత్రాన్ని విడుదల చేశామని అయిన కూడా మంచి విజయాన్ని అందుకుందని తెలిపారు. (Twitter/Photo)
అంతేకాదు అఖండ పాన్ వరల్డ్ చిత్రంగా నిలిచిందని పేర్కోన్నారు. అఖండ సినిమాను ఏపీ, తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ ఆదరిస్తున్నారన్నారు. అఖండ పాకిస్థాన్లోను చెలరేగిపోతోందని తెలిపారు. అక్కడి నుంచి వాట్సప్ వీడియోలు వస్తున్నాయని మాట్లాడారు బాలయ్య. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Twitter/Photo)
NBK - Akhanda : నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) ద్విపాత్రాభినయంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. నేటితో 6 వారాలు పూర్తి చేసుకొని 7వ వారంలో అడుగుపెట్టబోతుంది. అంతేకాదు ఈ నెల 20న 50వ రోజు జరుపుకోనుంది. (Twitter/Photo)
ఇక ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో పాటు పాటలు కూడా అంతే పాపులర్ అయ్యాయి. టైటిల్ సాంగ్ ’అఖండ’తో పాటు ‘జై బాలయ్య’ పాటకు మాస్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా ఈ సినిమా నుంచి జై బాలయ్య ఫుల్ సాంగ్ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే గురువావారం జనవరి 20 తో ఈ సినిమా 50 రోజుల పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో ట్రైలర్ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
అఖండ సినిమాకు ఇంత కలెక్షన్స్ ప్రభంజనం కురిసినా కూడా ఇప్పటికీ రెండు చోట్ల సినిమా సేఫ్ అవ్వలేదు. టోటల్గా గుంటూరు, కృష్ణా మినహా మిగిలిన చోట్ల మాత్రం అఖండకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి.రూ. 53 కోట్ల బిజినెస్ చేస్తే.. ఏకంగా రూ. 73 కోట్లు షేర్ వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది అఖండ. (Twitter/Photo)
ఇక చివరగా అఖండ సినిమా జనవరి 20న అఫీషియల్ గా 50 రోజుల పండగను జరుపుకోనుంది. ఇండస్ట్రీలో 50 రోజులు ఓ సినిమా పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. సినిమా రిలీజ్ కాస్త మిక్స్ డ్ టాక్ వస్తేనే నెల తిరిగే లోపు ఓటీటీలో పడిపోతోంది. అలాంటి నేపథ్యంలో అఖండ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రోజులు ఆడటం మామూలు విషయం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. (Twitter/Photo)
ఇక సుదర్శన్ 35 ఎంఎం వేదికగా ఈ వేడుకలు నిర్వహంచనున్నట్లు తెలిసింది. అంతేకాదు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సైతం 50 రోజుల వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం నిర్మాత స్వస్థలం అయిన సూర్యపేటలో భారీ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు బాలయ్యతో పాటు, సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత సిసలైన క్లీన్ బ్లాక్ బస్టర్ సినిమాగా అఖండ నిలిచిందని బాలయ్య ఫ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. (Twitter/Photo)