టాలీవుడ్ యువ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్“మాచర్ల నియోజకవర్గం”. ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తు్న్నారు. ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటోన్న ఈ సినిమా నుంచి ఓ ఖతర్నాక్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ నటిస్తుండగా.. స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ అంజలిని తీసుకుంటున్నారట. Photo : Twitter
అంతేకాదు దీనికి సంబంధించి షూట్ కూడా కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి టీమ్ ఓ ఫోస్టర్ను విడుదల చేసింది. ఇక ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. నితిన్ సరసన కృతిశెట్టి నటిస్తుండగా.. కీలకపాత్రలో హీరోయిన్ క్యాథరిన్ థ్రేసా కనిపించనుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై నిర్మితమవుతోన్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదలకానుంది. Photo : Instagram
Anjali: అంజలి సినీ కెరీర్ విషయానిక వస్తే.. షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన తెలుగందం అంజలి, తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించింది. హోమ్లీ పాత్రలతో సౌందర్య లేని లోటు తీర్చింది. ఈ అమ్మడు ఆ మధ్య విడుదలైన వకీల్ సాబ్ చిత్రంలో జరీనా పాత్రలో అద్భుతమైన నటన చూపించింది. Photo : Instagram
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన అంజలి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సినిమా మంచి విజయవంతం కావడంతో అంజలికి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత గీతాంజలి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్రమంగా అంజలికి ఇటు తెలుగులో, అటు తమిళంలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. Photo : Instagram
వకీల్ సాబ్ సినిమాలో అంజలి పాత్ర ఎంతో కీలకమైనది. అదే విధంగా ఈ సినిమాలో నటించిన మరొక హీరోయిన్ నివేద థామస్, అంజలి పాత్ర సినిమా హైలెట్స్ లో ఒక భాగమని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత మంచి పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకున్న అంజలికి వకీల్ సాబ్ సినిమా మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందా.. ఈ సినిమా అంజలి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందా? టాలీవుడ్ హీరోలు అంజలికి అవకాశాలు ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే. Photo : Instagram
ఈ సినిమా ఆ మధ్య పూజా కార్యక్రమంతో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ హై బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్లో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, మలయాళ హీరో సురేష్ గోపి నెగిటివ్ రోల్స్లో కనిపించనున్నారు. (Image: anjali /Facebook)
ఇక మీగితా పాత్రల్లో సునీల్, అంజలి, నవీన్ చంద్ర కనిపించనున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. (Image: anjali /Facebook)