రాజేంద్రప్రసాద్తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషకు కరోనా సోకింది. తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కోవిడ్ సోకిందని తెలిపారు త్రిష. దీనికి సంబంధించి ఆమె తాజాగా ట్వీట్ చేసింది. వైరస్ నుంచి వేగంగా కోలుకుంటున్నానని.. అంతేకాదు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నానని.. దీని వల్లే త్వరగా కోలుకుంటున్నాని వ్యాక్సిన్ వల్ల మేలు జరిగిందని పేర్కోన్నారు. త్రిష ప్రస్తుతం లండన్లో ఉన్నారు. Trisha Photo : Twitter
Thaman Corona : మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని తమన్ తన సోషల్ మీడియా అకౌంట్లో తెలియజేసారు. తనను కలిసి వాళ్లు కరోనా టెస్ట్ చేయించుకోమని తెలియజేసారు. నిన్ననే మహేష్ బాబు తనకు కరోనా సోకిన విషయాన్ని తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా తమన్ కరోనా టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్గా తేలింది. (Twitter/Photo)
తమన్ రెండు మూడేళ్లుగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. గతేడాది ‘క్రాక్’ ‘వకీల్సాబ్’, వైల్డ్ డాగ్’, ‘అఖండ’ సహా హిందీలో ‘సూర్యవంశీ’ సహా పలు చిత్రాలకు సంగీతం అందించిన తెలిసిందే కదా. ఏ సినిమా ఫంక్షన్కు వెళ్లిన అత్యంత జాగ్రత్తగా ఎక్కడ కరోనా సోకుతుందో ఏమో అని మాస్క్ పెట్టుకొని కనిపిస్తూ ఉంటారు. అలాంటి తమన్ తాజాగా త్రివిక్రమ్తో కలిసి మహేష్ బాబును దుబాయ్లో కలిసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా తమన్కు కరోనా సోకి ఉండవచ్చని అందరు చెప్పుకుంటున్నారు. (Twitter/Photo)
మంచు లక్ష్మి.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ వరస సినిమాలతో పాటు టీవ తెరపై కూడా బిజీగా ఉంటుంది మంచు వారమ్మాయి. ముఖ్యంగా సినిమాలు మాత్రమే కాకుండా హోస్టింగ్గానూ ఈమె చాలా బిజీ. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా తన పనులు తాను చేసుకంటూ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది మంచు లక్ష్మి. సోషల్ మీడియాలో కూడా మంచు లక్ష్మి ట్వీట్స్ ఎప్పటికప్పుడు ఆసక్తిగా ఉంటాయి. ఈమెకు కూడా కరోనా పాజిటివ్గా తేలింది.
అంతకు ముందు మంచు మనోజ్ తనకు కరోనా సోకినట్టు తెలియజేసిన విషయం తెలిసిందే కదా. గతేడాది మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ అందరినీ భయ భ్రాంతలకు గురి చేసింది. సామాన్య జనాలతో పాటు సినీ జనాలు కూడా కరోనాతో విలవిలలాడారు. 2022 కొత్త యేడాదిలో కూడా కరోనా థర్డ్ వేవ్ ఓమైక్రాన్ రూపంలో దేశంపై విరుచుపడుతోంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులు కొందరు కోవిడ్ బారిన పడుతున్నారు. (Manchu Manoj Corona)
కరోనా తాను ఇంకా పోలేదు.. ఇప్పటికీ ఉన్నానని గుర్తు చేస్తూనే ఉంది కరోనా మహామ్మారి(COVID 19). మరోసారి ఇండస్ట్రీపై వేటు వేయడానికి సిద్ధంగా ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా కరోనా అటాక్ చేయడం ఖాయం. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా మీనా కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ బారిన పడ్డారు.ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. న్యూ ఇయర్ మా ఇంట్లో వచ్చిన కొత్త అతిథి ‘కరోనా’ అంటూ ఛమాత్కరంగా చెప్పుకొచ్చారు. దానికి మా ఫ్యామిలీ అంతా నచ్చేసింది. కానీ ఆ అథితిని మేం త్వరలోనే సాగనంపుతాం అంటూ మీనా చెప్పింది. (Instagram/Photo)
వడివేలు.. తెలుగు ప్రేక్షకులు ఈయన్ని ముద్దుగా తమిళ బ్రహ్మానందంగా పిలుస్తూ ఉంటారు. ఈయన యాక్ట్ చేసిన దాదాపు అన్ని డబ్బింగ్ సినిమాలకు బ్రహ్మానందం వాయిస్ ఇవ్వడంతో ఈయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. రీసెంట్గా కరోనా బారిన పడ్డారు. దాదాపు మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చి తిరిగి మాములు మనిషయ్యారు. (vadivelu comedian)