Shivathmika Rajashekar : శివాత్మిక రాజశేఖర్.. ఆ మధ్య విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా శివాత్మిక ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయంటూ విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. శివాత్మిక ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తున్నారు. Photo : Instagram
Shivathmika Rajashekar : అది అలా ఉంటే శివాత్మిక ఎవరితోను లేచిపోయిందని ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. శివాత్మిక తన ప్రియుడితో దుబాయ్ వెళ్లినట్లు టాక్ నడిచింది. అయితే ఈ విషయంలో శివాత్మిక స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరితోను వెళ్లిపోలేదని.. తన పేరేంట్స్తోనే దుబాయ్ వచ్చానంటూ ఓ ఫోటోను పంచుకున్నారు. రూమర్స్ అంటే కొంతలో కొంత అయిన నమ్మశక్యంగా ఉండాలంటూ.. ఇలాంటీ రూమర్స్ నమ్మవద్దంటూ ఓ పోస్ట్ చేశారు. Photo : Instagram
దీంతో ఆమెపై వస్తోన్న రూమర్స్కు తెరపడినట్లు అయ్యింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. ఆమె తెలుగుతో పాటు పలు తమిళ సినిమాల్లోను నటిస్తున్నారు. అంతేకాదు పలు వెబ్ సిరీస్ల్లోను నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఆమె తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. Photo : Instagram
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ ( Krishna Vamsi) చాలా కాలం తర్వాత ‘రంగమార్తాండ’ అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజుతో తన షూటింగ్ పూర్తి అయ్యిందట. దీనికి సంబంధించి రాహుల్ సిప్లీగంజ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో తెలిపారు. ఈరోజుతో రంగ మార్తండ షూటింగ్ ముగిసిందని అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేశారు. Photo : Instagram
ఆ ఫోటోలో డైరెక్టర్ కృష్ణ వంశీ, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, పోనీ వర్మ, అలీ రేజా ఉన్నారు. ఇక అది అలా ఉంటే ఈ చిత్రానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వాయిస్ ఓవర్ను ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో సినిమాపై మరింత క్రేజ్ రానుందని చిత్రబృందం భావిస్తోంది. ఇక ఇదే విషయాన్నే తెలుపుతూ “తన మెగా వాయిస్ అందిస్తున్నందుకు అన్నయ్య చిరంజీవి థాంక్స్ చెబుతున్నాని” కృష్ణవంశీ ట్విట్టర్ వేదికగా ఆ మధ్య పోస్ట్ చేశారు. Photo : Instagram
రంగమార్తండ (Rangamarthanda)లో వర్సటైల్ యాక్టర్ రమ్యకృష్ణ కీలకపాత్రలో కనిపించనున్నారు. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణి (Ramya Krishna) రమ్యకృష్ణను డైరెక్ట్ చేస్తున్నారు. దీనికి తోడు సరైనా విజయాలు లేక సతమతమవుతోన్న కృష్ణంశీ నుంచి చాలా కాలం తర్వాత ఓ సినిమా వస్తుండడంతో మంచి అంచనాలు ఉన్నాయి. Photo : Instagram
కృష్ణవంశీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఓ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు చాలా ప్రత్యేకమైనవి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకు సరైన హిట్ లేదు. రామ్ చరణ్తో తీసిన గోవిందుడు అందరివాడేలే పరవాలేదనిపించింది. ఈ తాజా సినిమా నటసామ్రాట్ అనే మరాఠి క్లాసిక్ సినిమాకు రీమేక్గా వస్తోంది. కృష్ణవంశీ చిత్రాన్ని అన్ని విధాలా గొప్పగా ఉండేలా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ప్రఖ్యాత సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. Photo : Instagram
ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల విషయానికి వస్తే... ఒరిజినల్ చిత్రం నటసామ్రాట్లో నానా పాటేకర్ పోషించిన పాత్రని వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత బ్రహ్మనందం కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మరో పాత్రలో జబర్దస్త్ యాంకర్ అనసూయని (Anchor Anasuya) నటిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ. Photo : Instagram
అంతేకాదు ఈ సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ప్రత్యేకపాటలో అనసూయ నటించాల్సి ఉంటుందట. అనసూయ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ రానుందట. ఆ విధంగా కృష్ణవంశీ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమర్తె శివాత్మిక నటిస్తున్నారు. ఈ సినిమాలో ఈ ఇద్దరూ లవర్స్గా నటిస్తున్నారని టాక్. Photo : Instagram
ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాల ఇలా ఉండగానే కృష్ణవంశీ మరో సినిమాను ప్రకటించారు. అన్నం.. పరబ్రహ్మస్వరూపం అనే టైటిల్తో కృష్ణవంశీ కొత్తం చిత్రం రూపొందనుంది. దీనికి సంబంధించిన ఓ ప్రకటనను, మూవీ పోస్టర్ను కృష్ణ వంశీ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. Photo : Instagram