చిరంజీవి, రామ్ చరణ్లు కలిసి నటించిన లేటెస్ట సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్పై అనేక రూమర్స్ వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో విడుదలకానుందో అనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమా మే 20న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కు రానుందని అధికారిక ప్రకటన విడుదలైంది. దీంతో మరోసారి చిరంజీవి అభిమానులు తమ అభిమాన హీరో సినిమాను ఓటీటీలో చూడోచ్చని సంబర పడిపోతున్నారు.
రామ్ చరణ్ (Ram Charan) సిద్ద పాత్రలో కనిపించగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. చిరంజీవికి జోడిగా కాజల్లు తీసుకున్నారు. అంతేకాదు కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆమె పాత్రను తొలగించినట్లు ఇటీవల దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్తో ఆడిపాడింది.
ఇక మరోవైపు కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. ఆచార్య డివైడ్ టాక్కు కూడా అన్నే కారణాలున్నాయంటున్నారు ప్రేక్షకులు. తెలంగాణలో ఇప్పటికే టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. పైగా అదనంగా మరో రూ. 50 రూపాయలు పెంచడం.. మరోవైపు 10Th Class ఎగ్జామ్స్ కూడా ఉండటంతో కొన్ని ఫ్యామిలీలు థియేటర్స్ వైపు అసలు చూడటం లేదు. పైగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు చూడటంతో ఈ సినిమా చూడటానికి మొగ్గు చూపలేదు. ఇవన్ని కూడా ఈ సినిమా కలెక్షన్స్ పై తీత్ర ప్రభావం చూపించాయి.
ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర సినిమాలో సగం ఉంటోంది. ఇద్దరు నటన పరంగా బాగానే ఉన్న.. కథ, కథనం సరిగా లేకపోవడంతో ఈ సినిమా తేలిపోయింది.
కథ లేకుంటే ఇద్దరు క్రౌడ్ పుల్లర్ స్టార్స్ ఉన్న సినిమాను కాపాడలేదనే విషయం మరోసారి ఆచార్య రిజల్డ్తో స్పష్టమైంది. ఈ సినిమా ఏప్రిల్ 29 ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్లో విడుదలైంది. అంతేకాదు 132.50 కోట్ల టార్గెట్తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. మొత్తంగా ఈ సినిమా ఈ సినిమా రూ. 80 నుంచి రూ. 85 కోట్ల వరకు నష్టాలను మిగిల్చే అవకాశాలున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే ఓ మూడు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటున్నాయి. మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. కాగా ఆయన మరో ప్రాజెక్ట్ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి, ఒకప్పటి హీరోయిన్.. ఇప్పడు నిర్మాతగా రాణిస్తోన్న రాధిక (Radhika Sarath Kumar) నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ప్రాజెక్ట్లో రాధిక, చిరంజీవితో నటించనున్నారట. గతంలో చిరంజీవి, రాధిక కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాపీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ తాజా ప్రాజెక్ట్ సినిమానా లేక ఏదైనా వెబ్ సిరీస్ కోసమా అనేది తెలియాల్సి ఉంది.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఆయన తాజాగా నటించిన లేటెస్ట్ సినిమా ఆచార్య మంచి అంచనాల నడుమ ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో కీలకపాత్రలో కనిపించారు. చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన ఈ ‘ఆచార్య’ (Acharya )ను కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహించారు. ఆధ్యాత్మికాన్ని నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ సరికొత్తగా ఆచార్య సినిమాను తెరకెక్కించారు.
రామ్ చరణ్ (Ram Charan) సిద్ద పాత్రలో కనిపించగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. చిరంజీవికి జోడిగా కాజల్లు తీసుకున్నారు. అంతేకాదు కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆమె పాత్రను తొలగించినట్లు ఇటీవల దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్ చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా చేస్తుంది.
ఈ రెండు సినిమాలతో పాటు బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరంజీవి. ఇక మరోవైపు చిరంజీవి తాజాగా మరో సినిమాకు ఓకే అన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా దాదాపుగా ఖరారు అయ్యిందని అంటున్నారు. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్.
మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.