Political Actors: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ఐతే ఈ ఎన్నికల్లో పలువురు సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో ఎన్నికల బరిలో నిలిచి రాజకీయాలు చేశారు. ఈ ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ తప్ప.. పోటీ చేసిన మిగతా తారలు ఎవరు గెలవలేకపోయారు. మొత్తంగా ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపారు? అసలు ఎవరు ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు?.. మొత్తంగా సినీ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్లో అదృష్టం పరీక్షించుకున్న నటీనటుల విషయానికొస్తే.. (File/Photos)
Political Actors | సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ రావడం అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు.తెలుగు నాట అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు.అంతకు ముందు ఎంజీఆర్ కూడా ఏఐఏడీఎంకే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా.
రజినీకాంత్ గత పాతికేళ్లుగా ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చినా.. ఈ సారి రావడం మాత్రం పక్కా అని చెప్పారు రజినీకాంత్. అంతేకాదు పార్టీ స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 31న రాత్రి కొత్త పార్టీ పేరును అనౌన్స్ చేయనున్నట్టు చెప్పారు. కానీ ఇంతలోనే అనారోగ్యం పాలు కావడంతో తన రాజకీయాల్లో రావడం లేదంటూ ప్రకటించి మళ్లీ సంచలనం రేపారు. మొత్తంగా రాజకీయాల్లో వస్తానంటూ ఊరిస్తూ... చివరకు ఉసురు మనిపించారు. (File/Photo)
తన తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ తన పేరిట పొలిటికల్ పార్టీ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన విషయాన్నిహీరో విజయ్.. ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. తన తండ్రి తన పేరిట పెట్టబోతున్న పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. ఐనా.. విజయ్ పొలిటిక్ ఎంట్రీకి ఇవ్వబోతున్నట్టు చెప్పకనే చెప్పారు. కానీ ఈ ఎన్నికల్లో ఈయన డీఎంకేకు పరోక్షంగా మద్దుతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. (File/Photo)
తెలుగునాట ఒకప్పుడు అందాల తారగా వెలుగొందిన జయప్రద.. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.ముందు తెలుగు దేశం తరుపున రాజ్యసభ సభ్యరాలిగా పనిచేసిన జయప్రద.. ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీ తరుపున ఉత్తర్ ప్రదేశ్లోని రామ్ పూర్ లోక్సభ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆర్ఎల్డీ పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో బీజేపీలో జాయిన్ అయిన జయప్రద మరోసారి రామ్పూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసారు.కానీ ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్ధి అజాం ఖాన్ చేతిలో ఓడిపోయారు.
పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి. ఈయన తన సినిమా కెరీర్ కాదనుకుని జనసేన పార్టీతో బిజీగా మారిపోయాడు. గత ఎన్నికల్లో బీజేపీ,టీడీపీ కూటమి మద్దతు తెలిపి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాలతో కలిసి ఏపీలో పోటీకి దిగాడు. ఈ ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితం అయింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. (Twitter/Photo)
టీడీపీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన రోజా.. ఆ తర్వాత కాంగ్రెస్, ఆపై జగన్ వైసీపీలో జాయిన్ అయి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇపుడు మరోసారి MLA గా పోటీచేసి గెలిచారు. ఇపుడు ఏపీఐఐసీ చైర్మన్ అయ్యారు. మొత్తంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. మొదటి రెండు సార్లు టీడీపీ తరుపున ఓడి.. వైసీపీ తరుపున గెలిచారు. (File/Photo)
రెబల్ స్టార్గా బాలీవుడ్లో సంచలన సినిమాలు చేసిన శత్రుఘ్న సిన్హా ఆ తర్వాత రాజకీయాల్లోనూ సత్తా చూపించారు. బిజేపీలో ఆయన పలు కీలక పదవులు అధిష్టించారు. మొన్నటి ఎలక్షన్స్ ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు పాట్నా సాహెబ్ నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. (File/Photo)
మనోజ్ తివారి.. మనకు పెద్దగా తెలియని పేరు. కానీ భోజ్పురిలో సంచలనం ఈ పేరు. అక్కడ సూపర్ స్టార్గా సేవలు అందిస్తూనే రాజకీయాల్లోనూ సత్తా చూపించాడు మనోజ్ తివారి. ప్రస్తుతం బీజేపీ తరుపున ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి దివంగత షీలా దీక్షిత్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. (File/Photo)
విజయ్ కాంత్ కూడా అప్పట్లో తనకంటూ సొంత పార్టీ పెట్టుకున్నాడు. సినిమాల్లో సంచలన విజయాలు అందుకున్న ఈయన.. కొన్నాళ్లు రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు. ఈ ఎన్నికల్లో ఈయన పార్టీ బీజేపీ, అన్నాడీఎంకే పార్టీ పొత్తులో భాగంగా 4 ఎంపీ సీట్లలో పోటీ చేసి ఒక సీటు కూడా గెలవలేకపోయింది. (File/Photo)
ఒకప్పటి తమిళం గ్లామర్ హీరో కార్తీక్ కూడా రాజకీయాల్లో ప్రవేశించి తన లక్ పరీక్షించుకున్నారు. ఐనా ఒరిగిందేమి లేదు. 2009లో అహిలా ఇండియా నాడలుమ్ మక్కల్ కచ్చి అనే పార్టీ స్థాతపించారు. ఈయన పార్టీ తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించలేదు. (Ahila India Naadalum Makkal Katchi). ఆ తర్వాత 2018లొ మనిత ఉరైమైగల్ కాక్కుమ్ కచ్చి అనే రాజకీయ పార్టీ స్థాపించారు. ( Manitha Urimaigal Kaakkum Katchi on 15 December 2018). ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేదు. (Twitter/Photo)