Gold Price Today: Gold price today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కొద్ది కొద్దిగా పెరుగుతున్న బంగారం ధర.. ఒక్కసారిగా ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. దీంతో చాలా రోజుల తర్వాత పసిడి మోత మోగుతోంది. అయితే మన దేశంలో బంగారానికి మహిళలకు అత్యంత విలువ ఇస్తుంటారు. పసిడి ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్లో ఇక చెప్పనవసరం లేదు. వివిధ కారణాల వల్ల దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి.
ధరలు ఒక రోజు పెరిగి పెరిగితే ఒక రోజు తగ్గుతుంది.. లేకపోతే స్థిరంగా కొనసాగుతుంటాయి. ఇక తాజాగా ఇవాళ (సోమవారం -డిసెంబర్ 6)న దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల భారీగా పెరిగాయి. కొన్ని నగరాల్లో స్వల్పంగానూ, మరి కొన్ని నగరాల్లో భారీగా, మరి కొన్ని నగరాల్లో స్థిరంగా ఉన్నాయి. మొత్తం మీద దేశీయంగా బంగారం ధరలను పరిశీలిస్తే 10 గ్రాముల బంగారంపై స్వల్పంగా పెరిగింది. తాజాగా దేశీయంగా నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,910 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 51,170 రూపాయలుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,510 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 47,510 రూపాయలకు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,760 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,830 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,760 రూపాయులు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,830 రూపాయలకు పెరిగింది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,760 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల ధర 48,830 రూపాయలకు పెరిగింది.
బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 61,600 రూపాయులు ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 61,600 రూపాయలు ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర 65,600 ఉండగా, కోల్కతాలో రూ.61,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి 61,600 ఉండగా, హైదరాబాద్లో కిలో వెండి ధర 65,500 రూపాయలు ఉంది. విజయవాడలో 65,500 రూపాయలుగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ధరలు అధికంగానే ఉన్నాయి.