పెరుగు మనందరి ఇళ్లలోనూ ఉంటుంది. షాపుల్లో పెరుగు ప్యాకెట్లు కూడా లభిస్తున్నాయి. ఈ చిట్కా కోసం ఓ కప్పు పెరుగులో... 2 టీ స్పూన్ల అవిసె గింజలు (Flax seeds) కలపాలి. లేదా వాటిని పొడి చేసి కూడా వెయ్యవచ్చు. పొడి కోసం ముందుగా అవిసె గింజలను చిన్న మంటపై వేడి చెయ్యాలి. వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే పొడిగా మారతాయి. ఆ పొడిని 15 రోజుల దాకా నిల్వ చేసుకోవచ్చు. ఇలా పెరుగు, అవిసె గింజలను మధ్యాహ్నం వేళ తీసుకోవాలి. మూడు రోజులపాటూ ఇలా చేస్తే... కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. కీళ్ల మధ్య వచ్చే గరుకు శబ్దాలు కూడా తగ్గుతాయి. కీళ్లు బాగా పనిచేసేలా కీళ్ల మధ్య గుజ్జు పెరుగుతుంది.
మామూలుగా మాంసకృత్తులు (ప్రోటీన్స్) మాంసాహారంలో ఉంటాయి. మొక్కల నుంచీ వచ్చే ప్రోటీన్స్లో అవిసె గింజలు చెప్పుకోతగ్గవి. ప్రోటీన్స్ వల్ల ఆకలి తగ్గిపోతుంది. ఫలితంగా ఎక్కువ ఆహారం తినం కాబట్టి... అధిక బరువు సమస్య కొంతవరకూ తీరుతుంది. ఫైబర్ వల్ల కూడా మరో ప్రయోజనం ఉంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం అయిపోనివ్వకుండా... నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అందువల్ల కూడా వెంటనే ఆకలి కాదు. అందుకే అధిక బరువుతో ఇబ్బంది పడేవారు... ఫ్లాక్స్ సీడ్స్ డ్రింక్ తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.