Breakfast: మారుతున్న జీవన శైలి కారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ బిజీ అయిపోతున్నారు.. రాత్రి ఆలస్యంగా నిద్రపోయారనో.. లేక మార్నింగ్ ఎక్కువ పని ఉందనో.. ఏదో కారణంతో చాలామంది బ్రేక్ ఫాస్ట్ మిస్ చేస్తుంటారు..? మధ్యాహ్నం నేరుగా భోజనం పెట్టొచ్చులే అని బద్ధకిస్తారు.. అయితే పిల్లల విషయంలో మాత్రం ఆ పొరపాట్లు చేయొద్దు అంటున్నారు నిపుణులు.
కానీ చాలా మంది తల్లి దండ్రులు పిల్లలలకు ఉదయం స్కూల్ కు పంపే హాడాహుడిలో ఒ గ్లాసు పాలిచ్చి , మధ్యాహ్నం బోజనం క్యారేజ్ లో పెట్టి పంపించేస్తుంటారు. ఇలా చేయటం పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా భార్య, భర్తలు ఇరువురు ఉద్యాగస్తులైన కుటుంబాల్లో పిల్లలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేకుండానే పాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇది పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది అంటున్నారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకున్న పిల్లల్లో ఏకాగ్రత, చురుకుదనం అధికంగా ఉన్నట్లు తేలింది. పిల్లల్లో ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, చదివినవి గుర్తుంచుకోవడానికి, నాడీకణాలను ప్రశాంతంగా ఉంచి, మరింత చురుగా ఆలోచనా శక్తిని పెంచడానికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా విటమిన్స్, ప్రొటీన్స్, ఖనిజలవణాలతో కూడిన ఆహారాన్ని అందించాలి.
అయితే పిల్లలు మారాం చేస్తున్నారు కదా అని.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా జంక్ ఫుడ్ లాంటి వాటిని పిల్లలకు అందించటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇలా చేస్తే వారి దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్రప్రభావం ఉంటుంది. అందుకే మన సంప్రదాయ వంటలు అయిన ఇడ్లీ.. లేక మరే ఇతర పలహారాలైనా ఉత్తమమే అంటున్నారు. కాస్త ఆయిల్ ఫుడ్ మాత్రం దూరం పెడితే చాలు అంటున్నారు.