పుస్తకాలు చదవడమంటే ఒకప్పుడు రోజువారీ అలవాట్లలో భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది అవసరం కోసం మాత్రమే ఆ పని చేస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితం, మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల పుస్తకాలు చదివే వారి శాతం తగ్గిందనే చెప్పాలి. అయితే చదవడం వల్ల జ్ఞానాన్ని పెంచుకోవడమే కాకుండా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా? పుస్తకాలు, నవలలు, వార్తాపత్రికలు ఏవైనా చదవడం వల్ల శక్తిమంతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువ కాలం జీవించే ఛాన్స్ ఉంటుంది. చదవడం వల్ల కలిగి ఆరోగ్య ప్రయోజనాలు, చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. (symbolic image)
మెదడును చురుకుగా చేసే రీడింగ్: పఠనం మెదడులోని వివిధ భాగాల మధ్య కొత్త కనెక్షన్లను పెంచుతుంది. 2013లో జరిగిన అధ్యయనం ప్రకారం నవలలు మెదడును చురుగ్గా చేస్తాయి. భాషపై పట్టు పెరుగుతుంది. రీడింగ్ మెదడులోని న్యూరాన్లను సృష్టిస్తుందని న్యూయార్క్కు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ సబ్రినా రోమనోఫ్ చెప్పారు. ఈ ప్రక్రియను న్యూరోజెనిస్ అని పిలుస్తారు. న్యూరాన్లు మెదడులోని వివిధ ప్రాంతాలకు సందేశాలు పంపుతాయి. (symbolic image)
పెరగనున్న మెమరీ పవర్: జ్ఞానం అంటే గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, జడ్జిమెంట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటం. చదవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. 14 ఏళ్ల పాటు సాగిన అధ్యయనం వివరాల్ని 2020లో ప్రచురించారు. ఎక్కువసార్లు చదివిన వారికి 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వ్యవధిలో జ్ఞాన క్షీణత తక్కువగా ఉందని కనుగొన్నారు. 14 ఏళ్ల తర్వాత తక్కువ సార్లు చదివిన వారితో పోలిస్తే ఎక్కువసార్లు చదివిన వృద్ధులకు జ్ఞాన క్షీణత తగ్గుతోంది. అంతేకాకుండా చదవడం వల్ల మతిమరుపు రావడానికి కూడా తక్కువ అవకాశం ఉందని తేలింది. చైనాలో 2018లో చేసిన అధ్యయనం ప్రకారం ఐదేళ్ల కాలంలో 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారిని ట్రాక్ చేశారు. పఠనం లాంటి మేథో కార్యకలపాల్లో పాల్గొనడం వల్ల కొన్నేళ్ల తరువాత వచ్చే చిత్త వైకల్యం తక్కువగా ఉంటోందని కనుగొన్నారు. (symbolic image)
టెన్షన్ పరార్: కేవలం 30 నిమిషాలు చదవడం వల్ల ఒత్తిడి, శారీరక మానసిక ఆందోళనలను తగ్గించవచ్చు అని పరిశోధనలో తేలింది. 2009లో జరిగిన అధ్యయనం ప్రకారం గ్రాడ్యుయేట్ విద్యార్థులు చదవడం, యోగా చేయడం, హ్యూమరస్ వీడియోలు చూడటం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గాయి. 30 నిమిషాలు వార్తా కథనాలను చదివిన విద్యార్థుల హృదయ స్పందన రేటు, రక్తపోటు, ఒత్తిడి లాంటివి తగ్గాయని తేలింది. ఐతే... వార్తలు చదవడం అందరికి విశ్రాంతి ఇవ్వకపోవచ్చు. వాటి బదులుగా నవలలు, ఇతర కథలు చదవవచ్చు. (symbolic image)
దీర్ఘాయుష్షు: మెదడు ఆరోగ్యాన్ని పఠనం మెరుగుపరుస్తుంది. ఇది దీర్ఘాయుష్షును పెంచుతుంది. 12 ఏళ్ల పాటు సాగిన అధ్యయనం 2017లో ప్రచురితమైంది. దీని ప్రకారం పుస్తకాలు చదవని వారితో పోలిస్తే చదివేవారిలో మరణ ప్రమాదం 20 శాతం తగ్గుతుందని తేలింది. పఠనం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పడి... త్వరగా చనిపోయే అవకాశాలను తగ్గిస్తోంది. (symbolic image)
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుదల: మనుషులు చదువుతున్నప్పుడు మెదడులో దృశ్యాలు ఏర్పడుతుంటాయి. అవి మెమరీ రీకాల్, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. జ్ఞాపకశక్తి పెరగాలంటే రెగ్యలర్ రీడింగ్ అవసరమని రోమనోఫ్ చెప్పారు. 2013 అధ్యయనం ప్రకారం చదవడం, రాయడం వంటివి చేయని వారితో పోల్చితే... అవి చేసే వారి జ్ఞాపకశక్తి పెరుగుతోందని గుర్తించారు. (symbolic image)