రాత్రిళ్లు భోజనం తిన్న తర్వాత... వెంటనే పడుకోవద్దని డాక్టర్లు చెబుతుంటారు. కనీసం గంటన్నర తర్వాతే పడుకోమంటారు. రాత్రి వేళ అన్నం తింటే... షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయనీ, బరువు పెరిగిపోతారనీ ఇలా చాలా మంది అన్నం తినాలా వద్దా అని డౌట్ పడుతూ ఉంటారు. ఐతే... అన్నం బదులు... చపాతీలు తినమంటున్నారు డాక్టర్లు. దీని వల్ల చాలా లాభాలున్నాయి.
చపాతీలైతే... ఎంత నిల్వ ఉన్నవి తింటే అంత ఎక్కువ ఆరోగ్యం. అంటే... ఉదయం చేసుకున్న చపాతీలను రాత్రి పూట తిన్నా పర్వాలేదు. అదీ కాక... చపాతీలు వేగంగా అరగవు. నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అందువల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. దానికి తోడు... రాత్రివేళ జీర్ణక్రియా వ్యవస్థ నెమ్మదిగా సాగుతుంది. అందువల్ల రాత్రి వేళ చపాతీలు తినడమే బెటరంటున్నారు డాక్టర్లు.
బరువు తగ్గాలనుకునేవారు... చపాతీలను ఎక్కువ నూనె కాకుండా... తక్కువ నూనెతో కాల్చుకోవాలి. అసలు నూనె వెయ్యకుండా కూడా చేసుకోవచ్చు. అన్నం కంటే చపాతీ ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి. కాబట్టి రెండు లేదా మూడు చపాతీలు మాత్రమే తినాలి. లక్కేంటంటే చపాతీల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. పైగా గోధుమల్లో ఐరన్ ఎక్కువ కాబట్టి... రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అది గుండెకు మేలు చేస్తుంది.
కానీ చాలా మంది రాత్రి వేళే వాటిని తినేందుకు ఇష్టపడతారు. చపాతీల్లో కర్రీ కోసం రోజూ ఆలూ కర్రీనే వాడొద్దు. ఆలూ ఎక్కువ తింటే లావయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే బంగాళదుంపల్లో పిండి పదార్ధం అధిక మోతుదులో ఉంటుంది. దీని వల్ల లావయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఒక్కో రోజు ఒక్కో రకమైన కర్రీని వాడితే... అన్ని రకాల పోషకాలూ బాడీకి అందుతాయి.