ఇందులో మూడు కోర్సులు బౌద్ధ సంస్కృతికి భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా మార్చేందుకు దోహదపడతాయని యూజీసీ పేర్కొంది. వీటితోపాటు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, సామాజిక బాధ్యత కోర్సులను అందిస్తున్నట్లు తెలిపింది. 2023 జనవరి సెమిస్టర్ నుంచి ఆన్లైన్ ప్లాట్ఫారంలో అందుబాటులోకి వచ్చే ఈ కోర్సుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
నాలుగు కోర్సులు
బౌద్ధ సంస్కృతి , పర్యాటకంలో భారత్ను కేంద్రంగా చేసేందుకు ఇందులో మూడు కోర్సులను ప్రవేశపెట్టినట్లు తన అధికారిక నోటీసులో యూజీసీ పేర్కొంది. అవి భారత్ బౌద్ధ చరిత్ర, అభిదమ్మ (పాలి), బౌద్ధుల ఫిలాసఫి. నాలుగోది ఎంవోవోసీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించినది. ఉన్నత భారత్ అభియాన్లో భాగంగా జాతీయ విద్యా విధానం- 2020 సూచనల మేరకు ఈ కోర్సును తీసుకొచ్చారు.
భారత్ బౌద్ధ చరిత్ర
ఈ కోర్సు చేయాలని అనుకునే వారు మార్చి 15లోగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. 2023 ఫిబ్రవరి 6న ప్రారంభమై మే 22తో కోర్సు ముగుస్తుంది. వారణాసిలోని సమథ్లో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టిబెటన్ స్టడీస్ (CIHTS) హోస్ట్ యూనివర్సిటీగా వ్యవహరిస్తుంది. యూజీ, పీజీ విద్యార్థులు చేయవచ్చు.
బౌద్ధమతం ఫిలాసఫీ
బుద్ధుని తత్వం మీద ఆసక్తి ఉన్న యూజీ, పీజీ విద్యార్థులు ఈ కోర్సు చేయచ్చు. అందుకోసం మార్చి 15లోగా దరఖాస్తు చేసుకోవాలి. 2023 ఫిబ్రవరి 6తో మొదలై మే 22తో కోర్సు ముగుస్తుంది. వారణాసిలోని సమథ్లో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టిబెటన్ స్టడీస్ (CIHTS) హోస్ట్ యూనివర్సిటీగా వ్యవహరిస్తుంది.