ఈ నెల 16న గ్రూప్-1 పరీక్షను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీ విడుదల పై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే.. 8 పని దినాల్లో ప్రైమరీ కీని విడుదల చేస్తామని గతంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
సోమవారం నాటికి జిల్లాల నుంచి ఓఎంఆర్ షీట్లు రాజధానికి చేరకోగా.. మంగళవారం నుంచి ఇందుకు సంబంధించిన స్కానింగ్ ప్రక్రియను ప్రారంభించారు టీఎస్పీఎస్సీ అధికారులు. పండుగ సెలవులు పోగా.. ముందుగా ప్రకటించిన మేరకు 8 వర్కింగ్ డేస్ లో కీని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీఎస్పీఎస్సీ.(ప్రతీకాత్మక చిత్రం)
కొత్త ఓఎంఆర్ పత్రాలలో తాము పరీక్ష రాస్తే.. తమ జవాబు పత్రాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూల్యాంకనం చేయదనే అనుమానంతో అభ్యర్థులు నిరసనకు దిగారని, అయితే కలెక్టర్తో పాటు కమిషన్ అధికారులు వాళ్లకు సర్ది చెప్పడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు వాళ్లు తిరిగి తమ పరీక్షను కొనసాగించారని తెలిపారు. అయితే ఈ సమయంలో ఏ ఒక్క అభ్యర్థి కూడా బయటకు వెళ్లలేదని.. పరీక్ష పూర్తయిన తర్వాతనే వాళ్లు బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
నగరంలోని మూడు సెంటర్లలో ఇన్విజిలేటర్ల తప్పిదం వల్ల గ్రూప్–1పరీక్షను ఆలస్యంగా నిర్వహించినట్లు ఆయన అన్నారు. హైదరాబాద్లోని స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీ, అబిడ్స్లో ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన ఇద్దరు అభ్యర్థులకు 15 నిమిషాలు మరియు ఐదుగురు అభ్యర్థులకు 30 నిమిషాలు అదనపు సమయం ఇవ్వబడిందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)