హైద్రాబాద్ లో వినాయక విగ్రహల నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. రేపు ట్యాంక్ బండ్ లో వినాయక విగ్రహలను నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పై జీహెచ్ఎంసీ అధికారులు అవసరమైన క్రేన్ లను ఏర్పాటు చేశారు. మట్టి వినాయక విగ్రహలతో పాటు ఫ్లాస్టర్ ఆఫ్ ఫారిస్ తో చేసిన విగ్రహలను కూడ ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయనున్నారు.
అయితే నిమజ్జనం రోజు నగరమంతా పండగ వాతావరణం నెలకొంటుంది. దీంతో పోలీసులు అనేక మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. దీని కారణంగా ఆఫీసులు, విద్యాలయాలకు వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశముంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9న హైదరాబాద్ నగరవ్యాప్తంగా సెలవు ప్రకటించింది. దీనికి సంబంధించి బుధవారం జీవో జారీచేసింది