తెలంగాణ ఇంటర్ బోర్డ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల నుంచి వచ్చిన పలు వినతులను పరిశీలించి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్స్ కు సంబంధించిన ఆఖరి తేదీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ అంటే.. శుక్రవారం వరకు సప్లమెంటరీ పరీక్షలకు ఫీజును చెల్లించుకోవచ్చని తెలిపింది ఇంటర్ బోర్డ్. (ప్రతీకాత్మక చిత్రం)
వివిధ సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో ఫీజు చెల్లించొచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. వాస్తవానికి ఇంటర్ పరీక్షలకు సంబంధించిన అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించడానికి ఈ రోజు లాస్ట్ డేట్ గా తొలుత ప్రకటించారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
కానీ.. విద్యార్థులు, తల్లింద్రుల నుంచి వచ్చిన వినతుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువును పొడించారు. విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. వివిధ కారణాలతో ఇప్పటివరకు ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం ఇంటర్ బోర్డ్ సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే.. ఆగస్టు 1వ తేదీ నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)