కరోనా నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ముందు జాగ్రత్తగా ఈ నెల 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ సెలవు రోజుల్లో ఆన్లైన్ క్లాసుల నిర్వహిస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే సెలవులు ప్రకటించే సమయంలో ఆన్లైన్ క్లాసులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ప్రస్తుతం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ నెల 24 నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. 8, 9, 10 విద్యార్థులకు ఎల్లుండి అంటే సోమవారం నుంచి ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన పేరిట ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే, టీచర్లతో పాటు ఇతర సిబ్బంది హాజరు విషయంలోనూ తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. 50 శాతం టీచర్లు విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఎల్లుండి నుంచి తెలంగాణలో మళ్లీ స్కూల్లు తెరుచుకోనున్నాయి. అయితే, కేవలం టీచర్లు మాత్రమే స్కూళ్లకు హాజరు కానున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు కూడా ఆన్లైన్ తరగతులు కోసం అధికారులు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు నష్టపోకుండా అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు టీశాట్ ద్వారా తరగతులు బోధించాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేశారు. విద్యార్థులు ఈ షెడ్యూల్ ఫాలో అయ్యి తరగతులు వినాలని సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే, మొదట ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే, కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆ సెలవులను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ నెల 31 తర్వాత కూడా మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకుంటాయా? లేదా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. రోజు రోజుకూ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడమే ఇందుకు కారణం. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 31 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. అన్ని జాగ్రత్తలు తీసుకుని, కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఒక వేళ తరగతులు నిర్వహించకపోతే ఈ ప్రభావం పరీక్షలపై పడుతుందని అధికారులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ నేపథ్యంలో స్కూళ్లను తెరవాలని, కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తాత్కాలికంగా సెలవులు ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే మంత్రి సబితారెడ్డి అధికారుల నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో పాటు ఈ సారి టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ను రద్దు చేసే ప్రసక్తే లేదని సర్కార్ స్పష్టం చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)