ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ అధికారులు తాజాగా కీలక ప్రకటన చేశారు. భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు, విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇందులో జూనియర్ అసిస్టెంట్ విభాగంలో 177, మైనింగ్ ఇంజనీర్ విభాగంలో 39, ఇండస్ట్రియల్ ఇంజనీర్ విభాగంలో 10, ఐటీ ఇంజనీర్ విభాగంలో 6 ఖాళీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మొత్తం ఖాళీల సంఖ్య 232గా ఉంది. అయితే నోటిఫికేషన్లు విడుదలయ్యే నాటికి ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే.. గడిచిన ఏడేళ్లలో మొత్తం 16,040 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సింగరేణి సంస్థ తెలిపింది. 58 ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్ల ద్వారా 3,498, కారుణ్య వారసత్వ నియామకాల ద్వారా 12,553 నియామకాలను చేపట్టినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా ఉండేందుకు ఇంటర్వ్యూల విధానాన్ని పూర్తిగా వేసినట్లు సంస్థ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే.. తెలంగాణ సర్కార్ సైతం న్యూ ఇయర్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల కేటాయింపు, బదిలీల ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరింది. దీంతో ఈ ప్రక్రియ ముగియగానే ఉద్యోగాల భర్తీకి భారీగా నోటిఫికేషన్లు విడుదల అవుతాయని ప్రభుత్వ వర్గాలు విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. గత కొన్ని రోజులుగా ఉద్యోగాల బదిలీలు, కేటాయింపునకు సంబంధించిన ప్రక్రియ వేగంగా సాగుతోంది. జనవరి 20వ తేదీ నాటికి ఉద్యోగాల కేటాయింపు పూర్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)