1. నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్లో కేంద్ర రక్షణ శాఖకు చెందిన మిశ్ర ధాతు నిగమ్-MIDHANI సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 158 ఖాళీలు ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది మిధాని. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇవి ఏడాది కాలవ్యవధి గల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను మిధాని అధికారిక వెబ్సైట్ https://midhani-india.in/ ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్లో చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. ఇందులో దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్కు చివరి తేదీ లోగా అంటే అక్టోబర్ 16 లోగా పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)