1. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) విడుదల చేస్తుంటే, మరోవైపు ఇండియా పోస్ట్ కూడా గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఇప్పటికే ఇండియా పోస్ట్ (India Post) దేశంలో ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2,942 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) కూడా మరో జాబ్ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 650 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 34, తెలంగాణలో 21 పోస్టులున్నాయి. రెండేళ్ల కాలానికి ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. ఆ తర్వాత మరో ఏడాది గడువు పొడిగించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మే 20 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు IPPB అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాలి. జూన్లో ఎగ్జామ్ ఉంటుంది. అదే నెలలో ఫలితాలు కూడా విడుదలవుతాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. మొత్తం 650 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్- 34, తెలంగాణ- 21, అస్సాం- 25, బీహార్- 76, చత్తీస్గఢ్- 20, ఢిల్లీ- 4, గుజరాత్- 31, హర్యానా- 12, హిమాచల్ ప్రదేశ్- 9, జమ్మూ అండ్ కాశ్మీర్- 5, జార్ఖండ్- 8, కర్నాటక- 42, కేరళ- 7, మధ్యప్రదేశ్- 32, మహారాష్ట్ర- 71, ఒడిషా- 20, పంజాబ్- 18, రాజస్తాన్- 35, తమిళనాడు- 45, ఉత్తరప్రదేశ్- 84, ఉత్తరాఖండ్- 3, పశ్చిమ బెంగాల్- 33, ఈశాన్య రాష్ట్రాలు- 15 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మే 20 లోపు అప్లై చేయాలి. మే 27 తర్వాత అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. జూన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో పరీక్షా కేంద్రాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఫలితాలు కూడా జూన్లోనే విడుదలవుతాయి. విద్యార్హతల వివరాలు చూస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. గ్రామీణ డాక్ సేవక్గా రెండేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.700. ఎంపికైనవారికి నెలకు రూ.30,000 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ పోస్టులకు రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష 120 ప్రశ్నలకు ఉంటుంది. 120 మార్కులు ఉంటాయి. సమయం 90 నిమిషాలు. నెగిటీవ్ మార్కులు ఉండవు. కనీసం 40 మార్కులు వచ్చినవారు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయినవారికి అవసరాన్ని బట్టి లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)