1. టీచర్ జాబ్ కోరుకునేవారికి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో టీచర్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు ఏప్రిల్ 30న ముగిసింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయలేకపోయారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. అలాంటి వారికి మరో అవకాశం అందించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA. ఈ నియామక ప్రక్రియ చేపట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA దరఖాస్తు గడువును పొడిగించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2021 మే 31 లోగా దరఖాస్తు చేయొచ్చు. జూన్ 1 రాత్రి లోగా ఫీజు చెల్లించాలి. విద్యార్హతల్లో ఎలాంటి మార్పులు ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)
4. అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిక్రూట్మెంట్ https://recruitment.nta.nic.in/WebinfoEMRSRecruitment/ వెబ్సైట్లో అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ వివరాలు చూస్తే దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో మొత్తం 3479 టీచర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. (ప్రతీకాత్మక చిత్రం)
5. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ లాంటి పోస్టులున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ఖాళీలున్నాయి. తెలంగాణలో 262 పోస్టులు ఉండగా అందులో ప్రిన్సిపాల్- 11, వైస్ ప్రిన్సిపాల్- 6, పీజీటీ- 77, టీజీటీ- 168 ఖాళీలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 117 పోస్టులు ఉండగా అందులో ప్రిన్సిపాల్- 14, వైస్ ప్రిన్సిపాల్- 6, టీజీటీ- 97 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. దేశవ్యాప్తంగా మొత్తం 3479 ఖాళీలు ఉండగా అందులో ప్రిన్సిపాల్- 175, వైస్ ప్రిన్సిపాల్- 116, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్- 1244, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్- 1944 పోస్టులున్నాయి. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్, పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలో వెల్లడించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. విద్యార్హతల వివరాలు చూస్తే ప్రిన్సిపాల్ పోస్టుకు ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. లేదా టీచింగ్లో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. 10 ఏళ్లు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్గా పనిచేసిన అనుభవం ఉండాలి. టీజీటీ, పీజీటీ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం 288 స్కూల్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరో 452 స్కూళ్లను ప్రారంభిస్తోంది. దీంతో మొత్తం స్కూళ్ల సంఖ్య 740 కి చేరుకోనుంది. ఇప్పటికే రాష్ట్రాల నుంచి 100 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయి. త్వరలో స్కూళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. (ప్రతీకాత్మక చిత్రం)