ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సీఎం జగన్ తాజాగా కీలక ప్రకటన చేశారు. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులు సీఎం ఆదేశించారు. ఇందుకోసం పోలీస్, ఆర్థిక శాఖ అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా ఇందుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించాలన్నారు. ఆ ప్రాణాళికను జులై మొదటి వారంలోగా తనకు అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. (ప్రతీకాత్మక చిత్రం)
ఆ కార్యాచరణకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ క్యాలెండర్ కు సంబంధించిన సమీక్ష నిర్వహించిన సమయంలో ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు జగన్. శుక్రవారం జాబ్ క్యాలెండర్ (AP Job Calendar) పై సమీక్ష నిర్వహించిన ఆయన.. గత జాబ్ క్యాలెండర్ ప్రకారం పెండింగ్ లో ఉన్న 8వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాళాఖ, పోలీసు రిక్రూట్మెంట్పై దృష్టిపెట్టాలని ఆదేశించారు. (ఏపీ సీఎం జగన్ - File)
2021–22 జాబ్ కాలెండర్ ద్వారా మొత్తంగా 39,654 మంది నియామకం జరిగినట్లు వెల్లడించారు. జాబ్ క్యాలెండర్పై క్యాంప్ కార్యాలయంలో సమీక్షించిన సీఎం జగన్., వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీపై అధికారులతో సమీక్షించారు. ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్మెంట్, ఇంకా భర్తీచేయాల్సిన పోస్టులపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా రిక్రూట్ చేసిన పోస్టుల వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు. (ప్రతీకాత్మక చిత్రం)
బ్యాక్లాక్ పోస్టులు, ఏపీపీఎస్సీ, వైద్య, ఆరోగ్య – కుటుంబ సంక్షేమశాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్ మెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2021–22 ఏడాదిలో 39,654 పోస్టులను భర్తీ చేసినట్టుగా అధికారులు తెలిపారు. ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 39,310 పోస్టులు భర్తీ చేసినట్లు చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పటివరకు గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల రిక్రూట్మెంట్ ఈ ఒక్క ఏడాదిలో పూర్తైనట్లు వివరించారు. వీటిలో కేవలం 16.5శాతం పోస్టులను, అంటే సుమారు 8వేల పోస్టులు ఇంకా భర్తీచేయాల్సి ఉందన్నారు. ఈ పోస్టుల్లో 1198 పోస్టులు వైద్య ఆరోగ్యశాఖలోనే ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలిచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పటికే 39,654 పోస్టులను భర్తీ చేశామని.,. ఇవి కాక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26లక్షలమందికి పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంద్వారా మరో 50వేలమందిని ప్రభుత్వంలోకి తీసుకున్నామన్నారు. జాబ్ క్యాలెండర్లో నిర్దేశించుకున్న పోస్టుల్లో ఇంకా భర్తీ కాకుండా మిగిలిన పోస్టుల రిక్రూట్మెంట్పై కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. (ప్రతీకాత్మక చిత్రం)