గుజరాత్లో మాతృత్వానికే కళంకం తెచ్చింది ఓ మహిళ. సురేంద్రనగర్ జిల్లాలో కన్నతల్లే బిడ్డ పాలిట రాక్షసి అవతారమెత్తింది. తన ప్రియుడి కోసం రెండేళ్ల కొడుకును దారుణంగా హత్య చేసింది. పసివాడి తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈదారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల బాలుడి హత్యను గంటల వ్యవధిలో చేధించిన పోలీసులు హంతకురాలైన తల్లితో పాటు ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
సావర్కుండ్లకు చెందినది హుస్సేనా వాఘర్ మహిళ 8ఏళ్ల క్రితం సావర్కుండ్లలో సలీంభాయ్ రఫాయిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు వయసు నాలుగేళ్లు. రెండో కొడుకు ఆర్యన్ ఉమర్ వయస్సు 2 సంవత్సరాలు. తరచూ భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో హుస్సేనా మూడేళ్ల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకొని రాజ్కోట్లో నివసిస్తోంది.
హుసేనా భర్త సలీంభాయ్ కూడా రాజ్కోట్లోని తన అత్తారింటి పక్కనే విడివిడిగా ఉండేవాడు. గత 6 నెలల నుంచి హుస్సేనా పిల్లలిద్దరినీ పదే పదే కొట్టడంతో భర్త విసుగు చెంది సొంత ఊరికి వెళ్లిపోయాడు. సుమారు నెలన్నర రోజులుగా హుస్సేనా జాకీర్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన చిన్న కొడుకు ఆర్యన్తో కలిసి వాద్వాన్ ప్రాంతంలో ప్రియుడితో కలిసి నివసిస్తోంది. రెండేళ్ల బాలుడు ఆర్యన్ తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నతల్లి హుసేనాతో పాటు ఆమె ప్రియుడు జాకీర్ ఇద్దరూ తరచూ కొట్టేవారు.
చిన్న కొడుకు చనిపోయిన విషయం తెలుసుకున్న తండ్రి అంత్యక్రియలకు వచ్చి బిడ్డ శరీరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వీపు, పొత్తి కడుపు, వెనుక భాగంలో దెబ్బలతో కమిలిపోయిన మచ్చలు చూసి వైద్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఫోరెన్సిక్, బృందం, పోలీసులు స్పాట్కు చేరుకొని పసివాడి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. బాలుడ్ని గొంతు నులిమి చంపినట్లుగా తేలడంతో కన్నతల్లి హుసేనా, ఆమె ప్రియుడు జాకీర్పై కేసు నమోదు చేశారు.
తన బిడ్డను భార్య, ఆమె ప్రియుడు కలిసి చంపారని మృతుని తండ్రి సురేంద్రనగర్ బి డివిజన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే కొడుకును హత్య చేసిన తల్లి హుసేనా వాగర్తో పాటు ఆమె ప్రేమికుడు జాకీర్ ఫకీర్లను పట్టుకున్నారు. వారిద్దరూ హత్య చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.