కేంద్ర హోంశాఖ అన్ లాక్ 3 గైడ్ లైన్స్ జారీ చేసింది. ఆగస్ట్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. స్కూళ్లు, కాలేజీలు సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ధియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు మూసి ఉంటాయి. ప్రజలు రాత్రి పూట బయట తిరగవచ్చు. ఆగస్ట్ 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్ లు ఓపెన్ చేయవచ్చు. కేంద్రం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు. కంటైన్మెంట్ జోన్లలో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలవుతుంది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా ఆంక్షలు కొనసాగుతాయి.