తెలంగాణలో బోనాల సందడి మొదలైంది. సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆలయం బయట పండితులకు తొలి బోనాన్ని అందజేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సతీమణి స్వర్ణ. ప్రతీ సంవత్సరం... మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఇంటి నుంచే అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ.