కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3 గైడ్ లన్స్ జారీ చేసింది. ఆగస్ట్ 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఆగస్ట్ 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు బంద్ ఉండాల్సిందే. ప్రజలు రాత్రి పూట బయట తిరగవచ్చు. రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత. అయితే, కరోనా నిబంధనలు పాటించాలి. ఆగస్ట్ 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్ లు ఓపెన్ చేయవచ్చు. కేంద్రం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు. వందే భారత్ మిషన్ కింద మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాలు ఉంటాయి. మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ధియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు తెరవడానికి వీల్లేదు. వీటిపై ఆంక్షలు కొనసాగుతాయి. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదు. వీటిపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు.