India Corona Bulletin: భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఆ ఒక్క రాష్ట్రంలోనే సగానికి పైగా..
India Corona Bulletin: భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఆ ఒక్క రాష్ట్రంలోనే సగానికి పైగా..
India Corona Bulletin: భారత్లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక రోజు తగ్గుతూ.. మరో రోజు పెరిగినా.. కొత్త కేసులు 10 లోపే నమోదవుతున్నాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.
India Corona cases: భారత్లో గడిచిన 24 గంటల్లో 7,974 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్ నుంచి కొత్తగా 7,948 మంది కోలుకున్నారు. 343 మరణాలు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే కరోనా కేసులు ఏకంగా వెయ్యి పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,18,602కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,41,54,879 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,76,478 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 87,245 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
భారత్లో 20 రోజులుగా కొత్త కేసులు 10వేల లోపే నమోదవుతున్నాయి. ఐతే ఇవాళ్టి బులెటిన్లో ఉన్న మొత్తం కేసులు సగానికి పైగా కేరళ నుంచేే వచ్చాయి. అక్కడ మళ్లీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. టెస్ట్ పాజిటివిటీ రేటు 0.65 శాతంగా నమోదయింది. నిన్నటి బులెటిన్లో 0.59 శాతంగా ఉంది. గత 17 రోజులుగా టెస్ట్ పాజిటివిటీ రేటు 1 లోపే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
భారత్లో నిన్న 12,16,011 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 66.02 లక్షల మందికి కరోనా టెస్ట్లు నిర్వహించారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 60,12,425 మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 135.25 కోట్లకు పైగా డోస్ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)