ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ వేరియంట్ ఎంటరైపోయింది. ఇటీవల లండన్ నుంచి వచ్చిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉన్నా ఒమిక్రాన్ ఎంట్రీతో జనం భయపడిపోతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 30,747ట టెస్టులు నిర్వహించగా... 184 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13 జిల్లాల్లో 50 లోపు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణాజిల్లాలో 34 కేసులు నమోదుకాగా.. కర్నూలు జిల్లాలో ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదు. (ప్రతీకాత్మకచిత్రం)
జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 15, చిత్తూరు జిల్లాలో 15, తూర్పుగోదావరి జిల్లాలో 16, గుంటూరు జిల్లాలో 18, కడప జిల్లాలో 02, కృష్ణాజిల్లాలో 34, కర్నూలు జిల్లాలో 0, నెల్లూరు జిల్లాలో 11, ప్రకాశం జిల్లాలో 04, శ్రీకాకుళం జిల్లాలో 22, విశాఖపట్నం జిల్లాలో 20, విజయనగరం జిల్లాలో 09, పశ్చిమగోదావరి జిల్లాలో 18 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 204 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,008 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,93,131 మంది కోలుకున్నారు.ప్రస్తుతం ఈ జిల్లాలోనే అత్యధికంగా 401 యాక్టివ్ కేసులున్నాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 7 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)