ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ వేరియంట్ ఎంటరైపోయింది. ఇటీవల ఐర్లాండ్ నుంచి వచ్చిన విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉన్నా ఒమిక్రాన్ ఎంట్రీతో జనం హడలిపోతున్నారు. అటు తిరుపతిలోనూ ఒమిక్రాన్ కేసు నమోదైందన్న ప్రచారం మరింత టెన్షన్ కు గురిచేస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 30,859 టెస్టులు నిర్వహించగా... 160 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13 జిల్లాల్లోనూ 50 లోపు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 37 కేసులు నమోదుకాగా.. ప్రకాశం, విజయనగరం, కడప జిల్లాల్లో ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదు. (ప్రతీకాత్మకచిత్రం)
జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 15, చిత్తూరు జిల్లాలో 37, తూర్పుగోదావరి జిల్లాలో 29, గుంటూరు జిల్లాలో 12, కడప జిల్లాలో 00, కృష్ణాజిల్లాలో 19, కర్నూలు జిల్లాలో 02, నెల్లూరు జిల్లాలో 11, ప్రకాశం జిల్లాలో 00, శ్రీకాకుళం జిల్లాలో 09, విశాఖపట్నం జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో 00, పశ్చిమగోదావరి జిల్లాలో 14 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 201 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,912 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,93,189 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఈ జిల్లాలోనే అత్యధికంగా 432 యాక్టివ్ కేసులున్నాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 5 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
ప్రభుత్వం తాజాగా నిర్వహించిన 30, 859 టెస్టులతో కలిపి ఇప్పటివరకు 3,07,77,396 టెస్టులు నిర్వహించింది. గతంలో రోజుకు 50వేలకు పైగా టెస్టులు నిర్వహించిన ప్రభుత్వం.. వైరస్ వ్యాప్తి తగ్గడం, వ్యాక్సినేషన్ పెరగడంతో ప్రస్తుతం రోజుకు 30వేల టెస్టుల వరకు నిర్వహిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం) (image credit - reuters)