ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 15,654 టెస్టులు నిర్వహించగా.., 136 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడు జిల్లాల్లో పదిలోపే కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 27 కేసులు నమోదవగా.. శ్రీకాకుళం, విజనగరం జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు. (ప్రతీకాత్మకచిత్రం)
జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 15, చిత్తూరు జిల్లాలో 07, తూర్పు గోదావరి జిల్లాలో 25, గుంటూరు జిల్లాలో 26, కడప జిల్లాలో 04, కృష్ణా జిల్లాలో 21, కర్నూలు జిల్లాలో 03, నెల్లూరు జిల్లాలో 05, ప్రకాశం జిల్లాలో 07, శ్రీకాకుళం జిల్లాలో 00, విశాఖపట్నం జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో 00, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.