ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,158 టెస్టులు నిర్వహించగా... 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 జిల్లాల్లోనూ 20 లోపు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 కేసులు నమోదుకాగా.. ప్రకాశం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదు. (ప్రతీకాత్మకచిత్రం)
జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 04, చిత్తూరు జిల్లాలో 35, తూర్పుగోదావరి జిల్లాలో 06, గుంటూరు జిల్లాలో 18, కడప జిల్లాలో 8, కృష్ణాజిల్లాలో 23, కర్నూలు జిల్లాలో 00, నెల్లూరు జిల్లాలో 09, ప్రకాశం జిల్లాలో 00, శ్రీకాకుళం జిల్లాలో 03, విశాఖపట్నం జిల్లాలో 14, విజయనగరం జిల్లాలో 00, పశ్చిమగోదావరి జిల్లాలో 15 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 264 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,326 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,93,560 మంది కోలుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు అత్యధికంగా 269 యాక్టివ్ కేసులున్నాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
ప్రభుత్వం తాజాగా నిర్వహించిన 30,158 టెస్టులతో కలిపి ఇప్పటివరకు 3,10,98,568 టెస్టులు నిర్వహించింది. గతంలో రోజుకు 50వేలకు పైగా టెస్టులు నిర్వహించిన ప్రభుత్వం.. వైరస్ వ్యాప్తి తగ్గడం, వ్యాక్సినేషన్ పెరగడంతో ప్రస్తుతం రోజుకు 30వేల టెస్టుల వరకు నిర్వహిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం) (image credit - reuters)