ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. గురువారంతో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 200 వరకు తగ్గింది. ఒక్క జిల్లాల్లో కూడా రోజువారీ కేసుల సంఖ్య 200 దాటలేదు. నాలుగు జిల్లాల్లో పదిలోపే రోజువారీ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 2శాతానికంటే దిగువకు రావడం ఊరటనిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,463 శాంపుల్స్ ని పరీక్షించగా 809 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా బులిటెన్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 161 కేసులు కేసులు నమోదుకాగా... అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 10కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది.(ప్రతీకాత్మకచిత్రం) (image credit - Reuters)
జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 05, చిత్తూరు జిల్లాలో 153, తూర్పుగోదావరి జిల్లాలో 161, గుంటూరు జిల్లాలో 78, కడప జిల్లాలో 16, కృష్ణాజిల్లాలో 54, కర్నూలు జిల్లాలో 02, నెల్లూరు జిల్లాలో 115, ప్రకాశం జిల్లాలో 83, శ్రీకాకుళం జిల్లాలో 09, విశాఖపట్నం జిల్లాలో 39, విజయనగరం జిల్లాలో 01, పశ్చిమగోదావరి జిల్లాలో 93 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.
కరోనా సంబంధిత సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. కరోనాపై అధికారిక సమాచారం కోసం 8297104104 నెంబర్ కు వాట్సాప్ ద్వారా Hi, Hello, Covid అని మెసేజ్ చేస్తే డాక్టర్లు స్పందిస్తారు. స్మార్ట్ ఫోన్ లేనివారు 8297104104 ఫోన్ చేసి IVRS ద్వారా కరోనా సాయం పొందవచ్చు. నేరుగా 104కి కూడా కాల్ చేయవచ్చని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. (ప్రతీకాత్మకచిత్రం)