ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకం పరిధిలోకి మరిన్ని కంపెనీలను తీసుకురావడాన్ని ప్రభుత్వం పరిగణించాలని భారతీయ ద్విచక్ర వాహన తయారీదారులు అంటున్నారు. తయారీ, డిమాండ్ను ఉత్తేజపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగైన జాబ్ పాలసీని రూపొందించాయని హీరో ఎలక్ట్రిక్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముంజాల్ చెప్పారు. PLI పథకానికి సంబంధించినంతవరకు, ఇతర EV తయారీదారులను చేర్చడానికి ప్రభుత్వం తన పరిధిని విస్తరించాలి.(ఫ్రతీకాత్మక చిత్రం)
త్వరితగతిన EVల స్వీకరణ కోసం ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం అవసరమని ముంజాల్ అన్నారు. ప్రస్తుతం ఉన్న, రాబోయే అన్ని హౌసింగ్ ప్రాజెక్ట్లు, వాణిజ్య సంస్థల్లో EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని అన్నారు. ఇందుకోసం ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు వారిని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుంది.(ఫ్రతీకాత్మక చిత్రం)
భారతీయ కస్టమర్లు ఇప్పుడు ఇ-వాహనాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రారంభించారని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సొసైటీ చెబుతోంది. గత 15 ఏళ్లలో ప్రజలు కొనుగోలు చేసిన ఇ-వాహనాల సంఖ్య, ఒక 2021 సంవత్సరంలోనే కొనుగోలు చేశారు. గత సంవత్సరం మొత్తం 2.34 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు సేల్ అయ్యాయి. ఇది 2020 కంటే రెట్టింపు కంటే ఎక్కువ. (ఫ్రతీకాత్మక చిత్రం)