హైదరాబాద్, వరంగల్, విశాఖపట్టణం, విజయవాడ, చెన్నై, కోల్కతాలో వెండి ధరలు ఒకేలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో తులం వెండి ధర రూ.734గా ఉంది. ముంబై, న్యూఢిల్లీ, జైపూర్, లక్నోల్లో రూ.689కి లభిస్తోంది. గత 10 రోజుల్లో వెండి ధరలు ఐదు సార్లు పెరగ్గా.. మూడు సార్లు తగ్గాయి. రెండు రోజులు ధరలు స్థిరంగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
బంగారం, వెండి ధరలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ప్రతి రోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)