1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు అలర్ట్. 2021 జనవరి 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. మీరు పేమెంట్స్ కోసం ఎక్కువగా చెక్స్ ఇస్తున్నట్టైతే ఈ రూల్ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. చెక్ పేమెంట్స్ విషయంలో పాజిటీవ్ పే సిస్టమ్ ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆదేశించిన సంగతి తెలిసిందే. 2021 జనవరి 1 నుంచి బ్యాంకులన్నీ పాజిటీవ్ పే సిస్టమ్ అమలు చేయాలని ఆర్బీఐ గతంలోనే ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. దీంతో బ్యాంకులు ఈ మేరకు మార్పులు చేశాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కొత్త సంవత్సరంలో ఈ రూల్ అమలు చేస్తున్నట్టు ట్విట్టర్లో ప్రకటించింది. 2021 జనవరి 1 నుంచి చెక్ పేమెంట్స్కి పాజిటీవ్ పే అమలు చేస్తున్నట్టు తెలిపింది. రూ.50,000 పైన చెక్ పేమెంట్స్కి ఈ రూల్ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఉదాహరణకు మీరు ఎవరికైనా రూ.75,000 అమౌంట్తో చెక్ ఇచ్చారనుకుందాం. ఇప్పటివరకు ఉన్న పద్ధతి అయితే సదరు వ్యక్తి బ్యాంకులో చెక్ డిపాజిట్ చేసిన తర్వాత, చెక్ క్లియర్ కాగానే డబ్బులు మీ అకౌంట్ నుంచి ఆ వ్యక్తి అకౌంట్లోకి వెళ్తాయి. కానీ పాజిటీవ్ పే సిస్టమ్ ద్వారా చెక్ వెంటనే క్లియర్ కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. చెక్ క్లియర్ కావాలంటే మీరు వివరాలను కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు చెక్ ఇవ్వగానే సదరు వ్యక్తి బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు. ఆ తర్వాత మీకు సమాచారం అందుతుంది. ఆ చెక్కులో ఉన్న వివరాలన్నీ సరైనవేనా కాదా అని మీరు కన్ఫామ్ చేయాలి. మీరు కన్ఫామ్ చేసిన తర్వాతే చెక్ క్లియర్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)