South Central Railway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ఈ రైళ్లు ప్రారంభం.. వివరాలివే..
South Central Railway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ఈ రైళ్లు ప్రారంభం.. వివరాలివే..
South Central Railway: సికింద్రాబాద్ నుంచి గుహవటి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
1/ 8
కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లు రైల్వే శాఖ అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో లాక్ డౌన్ సమయం తగ్గించడం.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సడలింపుతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో రద్దీ ఎక్కువ అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
అయితే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్-గువాహటి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
సికింద్రాబాద్- గువాహటి (07030/07029) స్పెషల్ ట్రైన్ ఈ నెల 6, 13 తేదీల్లో ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి రెండవ రోజు ఉదయం 6.15 గంటలకు గువాహటి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
తిరుగు ప్రయాణంలో ఈనెల 9, 16 తేదీల్లో ఉదయం 6.45 గంటలకు గువాహటి నుంచి బయల్దేరి రెండవ రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ చేరు కుంటుందని వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
త్వరలోనే రద్దయిన రైళ్లను పునరుద్దరిస్తామని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)