1. బంగారంలో పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగో విడత (2021-22) గోల్డ్ బాండ్ల జారీ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఆరువిడతలుగా ఈ స్కీమ్ కింద గోల్డ్ బాండ్లను జారీచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. బంగారంలో పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్లో భాగంగా నాలుగో విడత (2021-22) గోల్డ్ బాండ్ల జారీ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఆరువిడతలుగా ఈ స్కీమ్ కింద గోల్డ్ బాండ్లను జారీచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కాంట్రిబూషన్కు ముందు వారం.. చివరి మూడు రోజుల్లో 999 ప్యూరిటీ పసిడి ధర ముగింపు సగటు ప్రాతిపదికన ఇష్యూ ధర నిర్ణయించినట్టు ఆర్బీఐ తెలిపింది. అంటే జులై 7, 8, 9 తేదీల్లో బంగారం ధర సగటును అనుసరించి గ్రాము రేటును నిర్ణయించినట్టు తెలుస్తోంది. మే 31 నుంచి జూన్ 4వరకు అమల్లో ఉన్న మూడవ విడత స్కీమ్ ధర గ్రాముకు రూ.4,889గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. అంటే ప్రస్తుతం గోల్డ్ బాండ్ రేటు మరింత తగ్గిందన్నమాట. ఈ అదృష్టంతోపాటు గ్రాముకు 50రూపాయల తగ్గింపు ఆఫర్ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. గోల్డ్ బాండ్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసే వారికి గ్రాముకు 50రూపాయల తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇప్పుడు గ్రాముకు 4,757 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. గొల్డ్ బాండ్లలో పెట్టుబడిపెట్టేవారు బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజిలలో వాటిని కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు. అయితే అత్యవసరం అనుకుంటే ఐదేళ్ళ తరువాత ఈ బాండ్లను అమ్ముకోవచ్చు. గోల్డ్ బాండ్లపై వడ్డీకూడా వస్తుంది. భారతీయ పౌరులెవరైనా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఎన్ఆర్ఐలకు ఈ అవకాశం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)