Special Trains: తిరుపతికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే
Special Trains: తిరుపతికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే
తిరుపతి శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ జంట నగరాల నుంచి తిరుపతికి ఈ పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07489: సికింద్రాబాద్-తిరుపతి ట్రైన్ ను ఏప్రిల్ 7,14 తేదీల్లో నడపనున్నట్ల ప్రకటించింది. ఈ రైళ్లు ఆయా తేదీల్లో 20.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 09:00 గంటలకు గమ్యానికి చేరుతాయి.
2/ 5
Train No.07490: తిరుపతి-సికింద్రాబాద్ ట్రైన్లను ఏప్రిల్ 9, 16 తేదీల్లో నడపనున్నట్లు వెల్లడించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్లు ఆయా తేదీల్లో సాయంత్రం 16.35 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 06:25 గంటలకు గమ్యానికి చేరుకుంటాయి.
3/ 5
ఆయా రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
4/ 5
ఈ రైళ్లకు ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్ లు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే.
5/ 5
దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన అధికారిక ప్రకటన (ఫొటో: ట్విట్టర్)