1. ఢిల్లీలో బయటపడ్డ ఓ సైబర్ మోసం పోలీసులకే షాక్ ఇచ్చింది. పలువురు బాలీవుడ్ నటీనటులు, ప్రముఖ క్రికెటర్ల పాన్ కార్డు (PAN Card) వివరాలు సేకరించి, వాటితో క్రెడిట్ కార్డులు తీసుకున్నారు. పూణెకు చెందిన ఫిన్టెక్ స్టార్టప్ అయిన వన్ కార్డ్ వీరి పేర్లతో క్రెడిట్ కార్డుల్ని (Credit Cards) జారీ చేయడం కలకలం రేపుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ సైబర్ మోసగాళ్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సెలబ్రిటీల GST గుర్తింపు సంఖ్యలు, పాన్ కార్డ్ వివరాలను సేకరించినట్టు తేలింది. అభిషేక్ బచ్చన్, శిల్పాశెట్టి, మాధురీ దీక్షిత్, ఇమ్రాన్ హష్మీ, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి సెలబ్రిటీల పేర్లను మోసగాళ్లు ఉపయోగించారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోహిత్ మీనా తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ విషయంపై విచారణ జరుగుతున్నందున, దానిపై మరిన్ని వివరాలు వెల్లడించలేమని మీనా తెలిపారు. సెలబ్రిటీల పేర్లతో క్రెడిట్ కార్డులు తీసుకున్న సైబర్ నేరగాళ్లు రూ.21.32 లక్షల విలువైన వస్తువుల్ని కొన్నట్టు తేలింది. ఢిల్లీ పోలీసులు ఈ ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. మోసగాళ్లు చేసిన లావాదేవీల ఫలితంగా కంపెనీ కూడా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. పూణేకు చెందిన ఎప్పీఎల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 'వన్ కార్డ్'ని జారీ చేస్తుంది. ఇది కాంటాక్ట్లెస్ మెటల్ క్రెడిట్ కార్డ్. వన్ కార్డును వన్ స్కోర్ యాప్లో వర్చువల్ పద్ధతిగా ఉపయోగించుకోవచ్చు. కస్టమర్లు ఆన్లైన్లో లేదా యాప్ బేస్డ్ లావాదేవీలు, కొనుగోళ్ల కోసం వన్ కార్డ్ ఉపయోగించవచ్చని కంపెనీ పోలీసులకు వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. సెలబ్రిటీల పుట్టిన తేదీల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని, దీంతో పాటు వారి పాన్ నెంబర్ల వివరాలను సేకరించారని, వీడియో వెరిఫికేషన్ సమయంలో నిందితులు సదరు సెలబ్రిటీ ఫోటోను పోలినట్టు ఉండే వ్యక్తితో వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసేవారని విచారణలో తేలింది. ఉదాహరణకు అభిషేక్ బచ్చన్ పాన్ కార్డులో ఉన్న ఫోటోకు మొహం మ్యాచ్ అయ్యే వ్యక్తితో వెరిఫికేషన్ చేయించారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ ముఠా ఆధార్ కార్డ్ వివరాలను కూడా ఫోర్జరీ చేసినట్టు తేలింది. ఈ వివరాలన్నీ లభించిన తర్వాత క్రెడిట్ కార్డులకు అప్లై చేశారు. వీడియో వెరిఫికేషన్ సమయంలో, వారి ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే, అప్పటికే CIBIL నుంచి సేకరించిన వివరాలు ఉండటంతో సులువుగా సమాధానం ఇచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
8. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తదుపరి విచారణ కొనసాగుతోంది. ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి క్రెడిట్ కార్డులు పొందేందుకు వారు ఇదే పద్ధతిని ఉపయోగించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ మోసగాళ్లు పాన్, ఆధార్ నంబర్ వంటి వివరాలను అప్లోడ్ చేయడం ద్వారా తమ యాప్ ద్వారా కంపెనీని సంప్రదించారని కంపెనీ వివరించింది. అందుకే వారి పేర్లపై క్రెడిట్ కార్డులు జారీ చేసినట్టు తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
9. కంపెనీ చేసిన ఫిర్యాదు ప్రకారం, "ఒకే డివైజ్ ఉపయోగించి అనేక ఆన్-బోర్డింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయని మా సిస్టమ్కు హెచ్చరిక వచ్చినప్పుడు మేము ఈ మోసం గురించి తెలుసుకున్నామని, నిందితులు ఏడు డివైజ్ల నుంచి 83 పాన్ వివరాలను ఉపయోగించి క్రెడిట్ కార్డులు తీసుకోవడానికి ప్రయత్నించారు. డాక్యుమెంట్లో ఉన్న అడ్రస్లకు ఫిజికల్ క్రెడిట్ కార్డులు కూడా పంపించాం" అని వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)