1. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10న మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ రెండు రైళ్లు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) నుంచి ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. ముంబై-షిరిడీ, ముంబై-సోలాపూర్ రూట్లలో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రస్తుతం భారతదేశంలో 8 వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రూట్లు చూస్తే 2019లో న్యూఢిల్లీ- వారణాసి రూట్లో మొదటి వందే భారత్ రైలు ప్రారంభం అయింది. అదే ఏడాది న్యూఢిల్లీ- కాట్రా రూట్లో రెండో వందే భారత్ రైలు ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక గతేడాది నుంచి వరుసగా వందే భారత్ రైళ్లు ప్రారంభం అవుతున్నాయి. గాంధీనగర్- ముంబై సెంట్రల్, న్యూఢిల్లీ- అంబ్ అందౌర, చెన్నై- మైసూరు, బిలాస్పూర్-నాగ్పూర్, హౌరా- న్యూ జల్పైగురి జంక్షన్, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం 8 వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఫిబ్రవరి 10న ముంబై-షిరిడీ, ముంబై-సోలాపూర్ రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రారంభమైతే దేశంలో తిరుగుతున్న ఈ సెమీ-హైస్పీడ్ రైళ్ల సంఖ్య 10 కి చేరుకుంటుంది. అయితే ముంబై నుంచి ప్రారంభం కాబోయే వందే భారత్ రైళ్లకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో ముంబైలోని అంధేరీ ఈస్ట్లో అరబిక్ అకాడమీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వందే భారత్ రైళ్లను ప్రారంభించవచ్చని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక ఫిబ్రవరిలోనే మరిన్ని రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రారంభం అవుతాయని వార్తలొస్తున్నాయి. ఒడిషాలోని పూరీ నుంచి పశ్చిమ బెంగాల్లోని హౌరా రూట్లో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఏ రోజున ప్రారంభోత్సవం ఉంటుందో స్పష్టత లేదు. ఈ రైలు పూరీ నుంచి భువనేశ్వర్ మీదుగా హౌరా వెళ్తుంది. కోణార్క్, పూరీ జగన్నాథ్ ఆలయాలను చూసేందుకు వచ్చే భక్తులకు, పర్యాటకులకు వందే భారత్ రైలు సేవలు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని రూట్లలో కూడా వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్రవరిలోనే సికింద్రాబాద్-తిరుపతి రూట్లో వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారని తాజాగా వార్తలొస్తున్నాయి. ఈ రూట్ కాకుండా సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, పూణె రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)